చాలా ఏళ్ల తర్వాత అయినా సరే.. తెలుగులో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల జాబితా తీస్తే అందులో సీతారామం మూవీకి కచ్చితంగా చోటు ఉంటుంది. హను రాఘవపూడి అంత గొప్పగా తీశాడు ఈ చిత్రాన్ని. చాలా సినిమాలు కాల క్రమంలో క్లాసిక్స్ అని, దృశ్యకావ్యం అని గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటాయి. కానీ సీతారామం మాత్రం తొలి రోజే క్లాసిక్ అయిపోయింది.
దృశ్యకావ్యంగా పేరు తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర కొంచెం డల్ నోట్తో మొదలైనప్పటికీ ఆ తర్వాత గొప్పగా పుంజుకుని లాంగ్ రన్తో కమర్షియల్గానూ పెద్ద విజయాన్నే అందుకుందీ చిత్రం. ఈ సినిమా తీసిన హను రాఘవపూడితో పాటు ప్రధాన పాత్రధారులు, టెక్నీషియన్లు, నిర్మాతలు.. ఇలా అందరికీ గొప్ప పేరు వచ్చింది. మరి ఈ కాంబినేషన్లో ఇంకో సినిమా వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన పులకింపజేసేదే.
ఐతే ఈ ఆలోచన త్వరలోనే కార్యరూపం దాల్చబోతున్నట్లు సమాచారం. హను దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ మరో సినిమాను నిర్మించబోతోందని.. ఇందులోనూ దుల్కర్, మృణాల్లే జంటగా నటిస్తారని తాజా సమాచారం. ఐతే ఇది సీతారామం చిత్రానికి సీక్వెల్ మాత్రం కాదట. ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని, మళ్లీ సీతారామం జంటతో సినిమా మాత్రం ఉంటుందని హను ఇంతకుముందే హింట్ ఇచ్చాడు.
ఇప్పుడు సీరియస్గానే ఆ ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీని గురించి ప్రకటన కూడా రాబోతోందట. ఐతే సీతారామంతో ప్రేక్షకులను అంతగా మైమరిచిపోయేలా చేసిన కాంబినేషన్లో ఇంకో సినిమా అంటే అంచనాలు భారీగా పెరిగిపోతాయి. ప్రతిదీ సీతారామంతో పోల్చి చూసి దానికి దీటుగా, ఇంకా గొప్పగా ఉండాలని ఆశిస్తారు. ఈ అంచనాలను అందుకోవడం అంత తేలికైతే కాదు.
This post was last modified on September 19, 2022 3:57 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…