హీరో హీరోయిన్ల వెంట ఉండే బౌన్సర్లు కొన్నిసార్లు మీడియాతో, అభిమానులుతో హద్దులు దాటి ప్రవర్తించడం వివాదాస్పదం అవుతుంటుంది. వాళ్ల పని ఆ స్టార్లను ప్రొటెక్ట్ చేయడమే అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో అవసరం లేని హంగామా చేస్తూ.. మీడియా వాళ్లు, అభిమానుల మీద జులుం చూపిస్తుంటారు.
తమ అభిమాన తారలను చూడడానికి ఫ్యాన్స్, వారి ఫొటోలు, బైట్స్ తీసుకోవడానికి మీడియా వాళ్లు గంటలు గంటలు ఎదురు చూస్తుంటారు. అవకాశం వచ్చినపుడు కలవడానికి, ఫొటోలు తీయడానికి ప్రయత్నిస్తారు. ఆ మాత్రం అవకాశం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తించడం అన్యాయం. తాజాగా తమన్నా పాల్గొన్న హైదరాబాద్ ఈవెంట్లో ఇలాంటి వివాదమే చోటు చేసుకుంది.
తన కొత్త చిత్రం బబ్లీ బౌన్సర్ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన తమన్నా కోసం చాలా సేపు వెయిట్ చేసిన ఫొటోగ్రాఫర్లు తన పొటోలు తీయడానికి కాస్త సమయం అడిగారు. కానీ తమ షెడ్యూల్లో ఫొటో షూట్ లేదంటూ బౌన్సర్లు దౌర్జన్యానికి దిగారు. ఫొటోగ్రాఫర్ల మీద దాడి చేశారు. అసలు సింపుల్గా తేలిపోయే విషయానికి బౌన్సర్లు అంత అతి చేయాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్నలు తలెత్తాయి. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బౌన్సర్లు ఎందుకంత అతి చేశారో జనాలకు అర్థం కావట్లేదు. నిజానికి తమన్నాకు ఇప్పుడు బాగా డిమాండ్ తగ్గింది. మీడియా అవసరం ఆమెకే ఎక్కువ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆమె బౌన్సర్లు కావాలనే అతి చేశారేమో.. ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్కేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. బబ్లీ బౌన్సర్ ఒక లేడీ బౌన్సర్ కథతో తెరకెక్కిన చిత్రం. దీనికి పబ్లిసిటీ రావాలనే బౌన్సర్లు అతి చేసి.. ఆ వీడియో వైరల్ అయ్యేలా చేసి ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో.
This post was last modified on September 18, 2022 4:40 pm
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…