హీరో హీరోయిన్ల వెంట ఉండే బౌన్సర్లు కొన్నిసార్లు మీడియాతో, అభిమానులుతో హద్దులు దాటి ప్రవర్తించడం వివాదాస్పదం అవుతుంటుంది. వాళ్ల పని ఆ స్టార్లను ప్రొటెక్ట్ చేయడమే అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో అవసరం లేని హంగామా చేస్తూ.. మీడియా వాళ్లు, అభిమానుల మీద జులుం చూపిస్తుంటారు.
తమ అభిమాన తారలను చూడడానికి ఫ్యాన్స్, వారి ఫొటోలు, బైట్స్ తీసుకోవడానికి మీడియా వాళ్లు గంటలు గంటలు ఎదురు చూస్తుంటారు. అవకాశం వచ్చినపుడు కలవడానికి, ఫొటోలు తీయడానికి ప్రయత్నిస్తారు. ఆ మాత్రం అవకాశం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తించడం అన్యాయం. తాజాగా తమన్నా పాల్గొన్న హైదరాబాద్ ఈవెంట్లో ఇలాంటి వివాదమే చోటు చేసుకుంది.
తన కొత్త చిత్రం బబ్లీ బౌన్సర్ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన తమన్నా కోసం చాలా సేపు వెయిట్ చేసిన ఫొటోగ్రాఫర్లు తన పొటోలు తీయడానికి కాస్త సమయం అడిగారు. కానీ తమ షెడ్యూల్లో ఫొటో షూట్ లేదంటూ బౌన్సర్లు దౌర్జన్యానికి దిగారు. ఫొటోగ్రాఫర్ల మీద దాడి చేశారు. అసలు సింపుల్గా తేలిపోయే విషయానికి బౌన్సర్లు అంత అతి చేయాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్నలు తలెత్తాయి. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బౌన్సర్లు ఎందుకంత అతి చేశారో జనాలకు అర్థం కావట్లేదు. నిజానికి తమన్నాకు ఇప్పుడు బాగా డిమాండ్ తగ్గింది. మీడియా అవసరం ఆమెకే ఎక్కువ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆమె బౌన్సర్లు కావాలనే అతి చేశారేమో.. ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్కేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. బబ్లీ బౌన్సర్ ఒక లేడీ బౌన్సర్ కథతో తెరకెక్కిన చిత్రం. దీనికి పబ్లిసిటీ రావాలనే బౌన్సర్లు అతి చేసి.. ఆ వీడియో వైరల్ అయ్యేలా చేసి ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో.
This post was last modified on September 18, 2022 4:40 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…