ఏ భాషలో మొదలుపెట్టినా వివాదాలు గొడవలతో నానా యాగీ చేసే బిగ్ బాస్ రియాలిటీ షో కొంత డల్ గా ఉండేది తెలుగులోనే. హిందీలో సల్మాన్ ఖాన్ పదమూడు సీజన్లు నడిపించినా అక్కడ ప్రతిసారి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో అదరగొడుతుంది. తమిళంలోనూ కమల్ హాసన్ యాంకరింగ్ తో ఇప్పటిదాకా తక్కువ రెస్పాన్స్ వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇక్కడ మాత్రం మొదట జూనియర్ ఎన్టీఆర్ తో మొదలుపెట్టి ఆ తర్వాత నానికి ఇచ్చి ఫైనల్ గా నాగార్జునకు పగ్గాలు ఇవ్వడం దాకా ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. మధ్యలో టిఆర్పి తగ్గినా బిగినింగ్ అండ్ కంక్లూజన్ మాత్రం అదిరిపోతాయి.
ఇటీవలే బిగ్ బాస్ 6 మొదలైన సంగతి తెలిసిందే. కానీ గతంలో ఉన్నంత ఊపు, సోషల్ మీడియాలో దీని గురించి చర్చ పెద్దగా కనిపించడం లేదు. పైగా ఓపెనింగ్ ఎపిసోడ్ కు 9 మించి టిఆర్పి రేటింగ్ రాలేదని టీవీ వర్గాల కథనం. ఇది నిజమో కాదో పక్కన పెడితే ఇంతకు ముందున్న ఎగ్జైట్ మెంట్ మాత్రం ప్రేక్షకుల్లో తగ్గిందనే చెప్పాలి. ఎన్నడూ లేనిది ఈసారి ఏకంగా 21 పార్టిసిపెంట్స్ ని తీసుకున్నారు. అయినా కూడా ఏమంత జోష్ అనిపించలేదు ఎక్కువగా బయట ప్రపంచానికి తెలియకుండా ఫేస్ బుక్, ఇన్స్ టాలో పాపులర్ అయినవాళ్లను తీసుకోవడం ఎఫెక్ట్ ఇచ్చింది.
ఇంకా రెండు వారాలు పూర్తిగా గడవలేదు కాబట్టి ఇంకో తొంబై రోజులకు పైగా సాగే షోలో చాలా అంటే చాలానే చేయొచ్చు. గతంలో కంటే ఈసారి మసాలా ఎక్కువుంటుందనే ప్రచారం జరిగింది కానీ అదింకా మొదలైతే కాలేదు. ఆ మధ్య ఓటిటిలో ఒక ఎక్స్ క్లూజివ్ సీజన్ చేయడం, తక్కువ గ్యాప్ లో ఇప్పుడు టీవీది మొదలుపెట్టడం లాంటి కారణాలు ఉన్నాయి కానీ అసలైన కిక్ షురూ చేయాలి. నాగార్జున ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో తమ సినిమా ప్రమోషన్ల కోసం స్టార్లు సెలబ్రిటీలు వస్తారు. బ్రహ్మాస్త్ర బోణీ చేసేసింది. తర్వాత ఘోస్ట్ టీమ్ తో పాటు ఇంకెవరెవరు రానున్నారో.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…