సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో నిర్మాతలు కనీసం రెండు మూడు నెలల ముందే అడ్వాన్స్ గా లాక్ చేసుకుంటే తప్ప కోరుకున్న సంఖ్యలో థియేటర్లు దొరకని పరిస్థితి నెలకొంది. అలా అని మనం ఫలానా తేదీకి వస్తున్నామని ముందే చెబితే ఇంకెవరూ రారన్న గ్యారెంటీ లేదు కానీ కనీసం ఫస్ట్ చెప్పారు కదానే గౌరవంతో లేదా భయంతో రాజీ పడే ప్రొడ్యూసర్లు ఉండకపోరు. డిసెంబర్ మొదటి వారానికి ఇప్పటిదాకా ఎవరూ కర్చీఫ్ వేసుకోలేదు. ఇవాళ అడవి శేష్ హిట్ 2 ది సెకండ్ కేస్ ని ఏడాది చివరి నెల 2న విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్ అప్డేట్ ఇచ్చేశారు.
నిజానికి ఆ స్లాట్ లో బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబో మూవీ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టే షూటింగ్ జరుగుతోంది కానీ 2023 సంక్రాంతి రేస్ లో దిగితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా జరుగుతోంది. ఒకవేళ ఆది పురుష్, వారసుడు, వాల్తేర్ వీరయ్యలు కనక ఆ సీజన్ ని లాక్ చేసుకుంటే బాలయ్యకు థియేటర్ల పరంగా కొంత చిక్కు ఏర్పడుతుంది. దానికంటే ఒకనెల ముందే వచ్చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అఖండకు అలా చేయడం చాలా కలిసి వచ్చింది. వారాలపాటు ఎలాంటి పోటీ లేకుండా బ్రహ్మాండమైన కలెక్షన్లు రాబట్టుకుంది.
ఇక శేష్ హిట్ 2 సంగతి చూస్తే మేజర్ ప్యాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఇకపై అతను చేయబోయే అన్ని సినిమాలు మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కు విశ్వక్ సేన్ నటించిన ఫస్ట్ పార్ట్ కు ఎలాంటి సంబంధం ఉండబోవడం లేదు. మేజర్ తెచ్చిన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని త్వరలో మొదలుపెట్టనున్న కొత్త షెడ్యూల్ లో కొన్ని కీలక మార్పులు చేస్తారని ఇన్ సైడ్ టాక్. ఒకవేళ ఫస్ట్ వీక్ వద్దనుకుంటే మూడో వారానికి వాయిదా పడే ఛాన్స్ ఉంది.
This post was last modified on September 15, 2022 10:03 pm
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…