దక్షిణాది నుంచి హిందీలో అత్యధిక చిత్రాలు చేసిన ఘనత అక్కినేని నాగార్జునకే దక్కుతుంది. శివ హిందీ వెర్షన్తో పాటు ఆయన చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు చేశాడు. ఆయన అక్కడ చేసిన సినిమాల్లో చాలా వరకు మల్టీస్టారర్లే. వాటిలో నాగ్కు కీలక పాత్రలే దక్కాయి. ఐతే 90ల్లో వరుసగా హిందీ సినిమాలు చేసిన నాగ్.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ తర్వాత బ్రహ్మాస్త్ర అనే భారీ చిత్రంలో అనీష్ అనే కీలక పాత్రలో మెరిశాడు. ఈ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. అది ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కథలో ఆ పాత్ర చాలా కీలకంగానే కనిపించింది.
ఈ సినిమాకు, తన పాత్రకు వచ్చిన రెస్పాన్స్ పట్ల నాగ్ చాలా హ్యాపీగానే ఉన్నాడు. ఐతే ఈ పాత్ర కోసం నేరుగా నాగార్జుననే అడిగారా అనే విషయంలో ఇప్పుడు సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇందుకు కారణం యువ కథానాయకుడు సుధీర్ బాబు చేసిన వ్యాఖ్యలే.
తన కొత్త చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన సుధీర్ బాబు.. బాలీవుడ్లో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ బ్రహ్మాస్త్ర సినిమాలో ఒక పాత్ర కోసం తనను అడగ్గా, తెలుగులో తీరిక లేకుండా సినిమాలు చేస్తుండడం వల్ల ఆ ఆఫర్ను రిజెక్ట్ చేసినట్లు వెల్లడించడం విశేషం.
సుధీర్కు ఏ పాత్ర ఆఫర్ చేసి ఉంటారని ఆలోచిస్తే నాగ్ చేసిన అనీష్ క్యారెక్టరే గుర్తుకొస్తుంది. అది కాకుండా అతడికి సూటయ్యే క్యారెక్టర్ కనిపించదు. అమితాబ్ చేసిన గురువు పాత్రకైతే అతను సూట్ కాడు. ఇక విలన్ బ్యాచులో కనిపించే ఛోటా రౌడీల పాత్రలకు అతణ్ని అడిగే అవకాశం లేదు. ఆల్రెడీ బాగీ లాంటి భారీ చిత్రంలో నటించిన అతడిని చిన్న పాత్రలకు అడిగి ఉండరు. మరి సుధీర్ చెబుతున్నది నిజమే అయితే.. నాగ్ చేసిన క్యారెక్టరే అతడికి ఆఫర్ చేసి ఉండొచ్చని, అతను కాదన్నాకే నాగ్ ఓకే చేసి ఉండొచ్చని అనిపిస్తోంది.
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇండియాలో ఎంత భారీ వసూళ్లు రాబడుతోందో చూస్తున్నాం, విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా కథలో…
సినిమా నటులు రాజకీయాల్లోకి వస్తే… ఈ తరహా మాటలే వినిపిస్తాయి. ఇక రాజకీయాల్లోకి వచ్చిన ఆ సినీ నటులు ఏకంగా…
సరిగ్గా మూడో వారంలో అడుగు పెట్టిన సందర్భంలో పెద్దికి కొత్త సీన్లు జోడించారు. కొన్ని హైదరాబాద్ సింగల్ స్క్రీన్లలో నిన్న…
మన శంకరవరప్రసాద్ గారుతో 2026 తొలి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి ఆరు నెలలు గ్యాప్ తీసుకుని…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్నంటిన విషయాన్ని కళ్లకు కట్టిన ఇటీవలి ప్రభుత్వ భూముల వేలం పెను…
సెలబ్రెటీల్లో అయినా.. సామాన్యుల్లో అయినా..ఒకసారి విడాకులు అయ్యాక తమ మాజీ భాగస్వాములతో కలవడానికి అంతగా ఇష్టపడరు. వారి గురించి మాట్లాడడానికి…