బాహుబలి-2లో తొలి పాట ఆరంభానికి ముందు భారీ విల్లుతో అగ్నితో కూడిని బాణాన్ని రావణాసురుడి మీదికి వదిలే సన్నివేశం ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. గూస్ బంప్స్ సీన్ అనే మాటకు ఇది అసలైన నిర్వచనం అని చెప్పొచ్చు. ఆ ఎలివేషన్, ఆ విజువల్ ప్రభాస్ అభిమానులను చాలా కాలం వెంటాడుతుందనడంలో సందేహం లేదు.
ఇదే సన్నివేశాన్ని ప్రభాస్ నిజ జీవితంలో చేసి చూపిస్తే ఎలా ఉంటుందన్న ఊహే అద్భుతంగా ఉంటుంది. ఇందుకోసం అయోధ్యలో సన్నాహాలు జరిగాయి కూడా. దసరా సందర్భంగా రావణాసుర దహన కార్యక్రమానికి ప్రభాస్తో పాటు ఆదిపురుష్ టీం హాజరయ్యేలా.. అక్కడ ప్రభాస్ బాహుబలి సీన్ను రిపీట్ చేస్తూ బాణం విసిరేలా ప్లాన్ చేశారు.
ఇక్కడి నుంచే ఆదిపురుష్ టీం తమ సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టాలని అనుకుంది. ఈ చిత్రం రామాయణం నేపథ్యంలో నడుస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రమోషన్లు మొదలుపెట్టడానికి ఇంతకంటే మంచి ముహూర్తం మరొకటి ఉండదని భావించారు. ఇక్కడే ఆదిపురుష్ టీజర్ కూడా లాంచ్ చేయడానికి నిర్ణయించినట్లు కూడా వార్తలొచ్చాయి.
కానీ ఇప్పుడు కృష్ణంరాజు మరణంతో ఈ ప్రణాళిక మారినట్లు తెలుస్తోంది. పెదనాన్న చనిపోయిన మూడు వారాల్లో ఇలాంటి భారీ కార్యక్రమంలో పాల్గొనడం కరెక్ట్ కాదని ప్రభాస్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకలో ప్రభాస్ పాల్గొనే అవకాశాలు లేవనే అంటున్నారు. ఐతే ఆదిపురుష్ టీం మాత్రం ఈ వేడుకలో పాల్గొంటుందని, టీజర్ కూడా అక్కడి నుంచే లాంచ్ చేస్తారని సమాచారం.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…