బాహుబలి-2లో తొలి పాట ఆరంభానికి ముందు భారీ విల్లుతో అగ్నితో కూడిని బాణాన్ని రావణాసురుడి మీదికి వదిలే సన్నివేశం ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. గూస్ బంప్స్ సీన్ అనే మాటకు ఇది అసలైన నిర్వచనం అని చెప్పొచ్చు. ఆ ఎలివేషన్, ఆ విజువల్ ప్రభాస్ అభిమానులను చాలా కాలం వెంటాడుతుందనడంలో సందేహం లేదు.
ఇదే సన్నివేశాన్ని ప్రభాస్ నిజ జీవితంలో చేసి చూపిస్తే ఎలా ఉంటుందన్న ఊహే అద్భుతంగా ఉంటుంది. ఇందుకోసం అయోధ్యలో సన్నాహాలు జరిగాయి కూడా. దసరా సందర్భంగా రావణాసుర దహన కార్యక్రమానికి ప్రభాస్తో పాటు ఆదిపురుష్ టీం హాజరయ్యేలా.. అక్కడ ప్రభాస్ బాహుబలి సీన్ను రిపీట్ చేస్తూ బాణం విసిరేలా ప్లాన్ చేశారు.
ఇక్కడి నుంచే ఆదిపురుష్ టీం తమ సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టాలని అనుకుంది. ఈ చిత్రం రామాయణం నేపథ్యంలో నడుస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రమోషన్లు మొదలుపెట్టడానికి ఇంతకంటే మంచి ముహూర్తం మరొకటి ఉండదని భావించారు. ఇక్కడే ఆదిపురుష్ టీజర్ కూడా లాంచ్ చేయడానికి నిర్ణయించినట్లు కూడా వార్తలొచ్చాయి.
కానీ ఇప్పుడు కృష్ణంరాజు మరణంతో ఈ ప్రణాళిక మారినట్లు తెలుస్తోంది. పెదనాన్న చనిపోయిన మూడు వారాల్లో ఇలాంటి భారీ కార్యక్రమంలో పాల్గొనడం కరెక్ట్ కాదని ప్రభాస్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకలో ప్రభాస్ పాల్గొనే అవకాశాలు లేవనే అంటున్నారు. ఐతే ఆదిపురుష్ టీం మాత్రం ఈ వేడుకలో పాల్గొంటుందని, టీజర్ కూడా అక్కడి నుంచే లాంచ్ చేస్తారని సమాచారం.
This post was last modified on September 14, 2022 2:45 pm
కొవిడ్ వల్ల సినీ పరిశ్రమలు ఎలా కుదేలయ్యాయో తెలిసిందే. కానీ ఆ టైంలో మలయాళ ఇండస్ట్రీ సైతం ఇబ్బంది పడింది…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్..టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుల మద్య స్నేహబంధం ఇప్పటిది కాదు. ఎప్పుడో చంద్రబాబు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహారం చూస్తుంటే...…
సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో…
గేమ్ ఛేంజర్ పాటల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఒక కంపోజర్ గా తాను పాతిక నుంచి ముప్పై…
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…