బాహుబలి-2లో తొలి పాట ఆరంభానికి ముందు భారీ విల్లుతో అగ్నితో కూడిని బాణాన్ని రావణాసురుడి మీదికి వదిలే సన్నివేశం ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. గూస్ బంప్స్ సీన్ అనే మాటకు ఇది అసలైన నిర్వచనం అని చెప్పొచ్చు. ఆ ఎలివేషన్, ఆ విజువల్ ప్రభాస్ అభిమానులను చాలా కాలం వెంటాడుతుందనడంలో సందేహం లేదు.
ఇదే సన్నివేశాన్ని ప్రభాస్ నిజ జీవితంలో చేసి చూపిస్తే ఎలా ఉంటుందన్న ఊహే అద్భుతంగా ఉంటుంది. ఇందుకోసం అయోధ్యలో సన్నాహాలు జరిగాయి కూడా. దసరా సందర్భంగా రావణాసుర దహన కార్యక్రమానికి ప్రభాస్తో పాటు ఆదిపురుష్ టీం హాజరయ్యేలా.. అక్కడ ప్రభాస్ బాహుబలి సీన్ను రిపీట్ చేస్తూ బాణం విసిరేలా ప్లాన్ చేశారు.
ఇక్కడి నుంచే ఆదిపురుష్ టీం తమ సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టాలని అనుకుంది. ఈ చిత్రం రామాయణం నేపథ్యంలో నడుస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రమోషన్లు మొదలుపెట్టడానికి ఇంతకంటే మంచి ముహూర్తం మరొకటి ఉండదని భావించారు. ఇక్కడే ఆదిపురుష్ టీజర్ కూడా లాంచ్ చేయడానికి నిర్ణయించినట్లు కూడా వార్తలొచ్చాయి.
కానీ ఇప్పుడు కృష్ణంరాజు మరణంతో ఈ ప్రణాళిక మారినట్లు తెలుస్తోంది. పెదనాన్న చనిపోయిన మూడు వారాల్లో ఇలాంటి భారీ కార్యక్రమంలో పాల్గొనడం కరెక్ట్ కాదని ప్రభాస్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకలో ప్రభాస్ పాల్గొనే అవకాశాలు లేవనే అంటున్నారు. ఐతే ఆదిపురుష్ టీం మాత్రం ఈ వేడుకలో పాల్గొంటుందని, టీజర్ కూడా అక్కడి నుంచే లాంచ్ చేస్తారని సమాచారం.
వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి అనుకున్నట్లే మల్టీస్టారర్ ను పట్టాలెక్కించారు. ఈ ప్రాజెక్ట్ ఉదయమే…
పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. పెట్రోలియం శాఖ కార్యదర్శి శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసిన ప్రకటనలో…
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం మీద సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మూడు…
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 2022లో థియేటర్లలోకి…
ఈ రోజుల్లో మిడ్ రేంజ్ స్టార్ల సినిమాలకు కూడా జనం థియేటర్లకు కష్టమైపోతోంది. ప్రోమోలు చాలా ఆకర్షణీయంగా ఉండి, మంచి…
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇండియాలో ఎంత భారీ వసూళ్లు రాబడుతోందో చూస్తున్నాం, విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా కథలో…