బాహుబలి-2లో తొలి పాట ఆరంభానికి ముందు భారీ విల్లుతో అగ్నితో కూడిని బాణాన్ని రావణాసురుడి మీదికి వదిలే సన్నివేశం ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. గూస్ బంప్స్ సీన్ అనే మాటకు ఇది అసలైన నిర్వచనం అని చెప్పొచ్చు. ఆ ఎలివేషన్, ఆ విజువల్ ప్రభాస్ అభిమానులను చాలా కాలం వెంటాడుతుందనడంలో సందేహం లేదు.
ఇదే సన్నివేశాన్ని ప్రభాస్ నిజ జీవితంలో చేసి చూపిస్తే ఎలా ఉంటుందన్న ఊహే అద్భుతంగా ఉంటుంది. ఇందుకోసం అయోధ్యలో సన్నాహాలు జరిగాయి కూడా. దసరా సందర్భంగా రావణాసుర దహన కార్యక్రమానికి ప్రభాస్తో పాటు ఆదిపురుష్ టీం హాజరయ్యేలా.. అక్కడ ప్రభాస్ బాహుబలి సీన్ను రిపీట్ చేస్తూ బాణం విసిరేలా ప్లాన్ చేశారు.
ఇక్కడి నుంచే ఆదిపురుష్ టీం తమ సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టాలని అనుకుంది. ఈ చిత్రం రామాయణం నేపథ్యంలో నడుస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రమోషన్లు మొదలుపెట్టడానికి ఇంతకంటే మంచి ముహూర్తం మరొకటి ఉండదని భావించారు. ఇక్కడే ఆదిపురుష్ టీజర్ కూడా లాంచ్ చేయడానికి నిర్ణయించినట్లు కూడా వార్తలొచ్చాయి.
కానీ ఇప్పుడు కృష్ణంరాజు మరణంతో ఈ ప్రణాళిక మారినట్లు తెలుస్తోంది. పెదనాన్న చనిపోయిన మూడు వారాల్లో ఇలాంటి భారీ కార్యక్రమంలో పాల్గొనడం కరెక్ట్ కాదని ప్రభాస్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకలో ప్రభాస్ పాల్గొనే అవకాశాలు లేవనే అంటున్నారు. ఐతే ఆదిపురుష్ టీం మాత్రం ఈ వేడుకలో పాల్గొంటుందని, టీజర్ కూడా అక్కడి నుంచే లాంచ్ చేస్తారని సమాచారం.
This post was last modified on September 14, 2022 2:45 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…