రానా సినిమా ఆగిపోయినట్టేనా!?

కరోనా వైరస్ ప్రభావం సినీ ఇండస్ట్రీపై తీవ్రంగా పడింది. ఈ మహమ్మారి కారణంగా ఇంకొన్నిరోజుల్లో గుమ్మడికాయ కొట్టాల్సిన సినిమాల షూటింగ్స్ అర్ధాంతరంగా నిలిచిపోగా, మరికొన్ని సినిమాలు టెంకాయ కూడా కొట్టకుండానే ఆగిపోతున్నాయి. ఇలా కరోనా కారణంగా షూటింగ్ మొదలెట్టకుండానే ఆగిపోయిన సినిమాల లిస్టులోకి దగ్గుపాటి రానా సినిమా కూడా చేరినట్టు టాక్.

‘రుద్రమదేవి’ సినిమా తర్వాత ‘హిరణ్య కశ్యప’ సినిమాను ప్రకటించాడు డైరెక్టర్ గుణశేఖర్. దగ్గుపాటి రానా హిరణ్యకశ్యకుడిగా కనిపించబోతున్నాడని కూడా ప్రకటించాడు. రానా ఎప్పటినుంచో చేయాలని కోరుకుంటున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు రూ.180 కోట్ల భారీ బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. రేపో మాపో ఈ మూవీ ప్రారంభమవుతుందని గుణశేఖర్ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న తరుణంలో కరోనా సంక్షోభం వచ్చింది.

ఇప్పుడు రానా మూవీపై అంత భారీ బడ్జెట్ పెట్టడమంటే చాలా పెద్ద రిస్క్ చేయడమే అవుతుంది. అదీగాక గుణశేఖర్ – రానా కాంబిపై డిస్టిబ్యూటర్లు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. అందుకే నిర్మాత సురేశ్ బాబు ఆలోచనల్లో పడ్డారట. కొడుకు కోసం ఇంత బడ్జెట్ పెడదామన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత రిస్క్ చేసేకంటే ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టడమే బెటర్ అనుకుంటున్నట్టు టాక్.

మరోవైపు రానా హీరోగా మూడు భాషల్లో భారీగా రూపొందిన ‘అరణ్య’ షూటింగ్ పూర్తిచేసుకుని, రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కానీ ఈ మూవీ భవితవ్యం ఏమిటో తెలీదు. అలాగే ‘విరాట పర్వం’ మూవీలో రానా పార్ట్ షూటింగ్ మిగిలి ఉంది. ఈ రెండు సినిమాల రిజల్ట్‌ను బట్టి,  హిరణ్య కశ్యపుడి  గురించి ఆలోచించాలని డిసైడ్ అయ్యారట చిత్రయూనిట్.

This post was last modified on April 22, 2020 1:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

47 minutes ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

1 hour ago

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

2 hours ago

కృతి శెట్టిని వెంటాడుతున్న వాయిదాలు

ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…

2 hours ago

ఆ ఆస్తులపై షర్మిలకు హక్కు లేదా?

రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌…

3 hours ago

వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్

ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…

5 hours ago