శింబు హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన వెందు తనిన్దాతు కాడు తెలుగులో ది లైఫ్ అఫ్ ముత్తుగా ఈ నెల 15న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ బుకింగ్ యాప్స్ లో టికెట్ల అమ్మకాలు కూడా మొదలుపెట్టేశారు. అంతా సవ్యంగా ఉందని ఎదురు చూస్తున్న తరుణంలో సాంకేతిక కారణాల వల్ల రెండు రోజులు ఆలస్యంగా టాలీవుడ్ వెర్షన్ ని రిలీజ్ చేయబోతున్నట్టు ఇక్కడి హక్కులు సొంతం చేసుకున్న స్రవంతి మూవీస్ అఫీషియల్ గా ప్రకటించింది. తమిళంలో మాత్రం ముందు చెప్పిన డేట్ కే వస్తుంది. ఎటొచ్చి డబ్బింగ్ దే ఆలస్యం.
సకాలంలో అనువాద కార్యక్రమాలు పూర్తి కాకపోవడం వల్లే ఈ వాయిదా తప్పలేదని వినికిడి. నిజానికి ఈ డీల్ కేవలం ఒక వారం ముందు జరిగింది. కనీసం ప్రమోషన్ చేయడానికి తగినంత టైం లేని ఒత్తిడిలో నిర్మాత రవి కిషోర్ లైఫ్ అఫ్ ముత్తుని కొన్నారు. అది కూడా శింబుకి మంచి స్నేహితుడైన హీరో రామ్ రికమండేషన్ తోనే ఇదంతా జరిగిందనే టాక్ ఉంది. శింబుకి ఇక్కడ మార్కెట్ లేదు. ఏదో ఆషామాషీగా సినిమా వదలితే ఓపెనింగ్స్ కష్టమే. ఏదో కంటెంట్ మీద నమ్మకంతో ధైర్యం చేశారు కానీ పోస్టర్లు, టీజర్ హైప్ తెచ్చేలా లేవు.
గతంలో మానాడు విషయంలోనూ అచ్చం ఇలాగే జరిగింది. ఉదయం షో పడతాయి అనంగా ఉన్నట్టుండి షోలు రద్దు చేశారు. కట్ చేస్తే అసలు రిలీజే కాలేదు. తర్వాత కొంత కాలానికి సురేష్ సంస్థ రీమేక్ హక్కులను కొనేసింది. ఇంకా మొదలుపెట్టలేదు కానీ ఈలోగా ఓటిటిలో తెలుగు ఆడియోతో సహా వచ్చినప్పుడు మన ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ది లైఫ్ అఫ్ ముత్తుకి ఆ సమస్య రాదు కానీ రెండు రోజులు లేట్ అంటే ఈలోగా కోలీవుడ్ నుంచి రిపోర్టులు రివ్యూలు వచ్చేస్తాయి. అవి పాజిటివ్ గా ఉంటే ప్లస్ అవుతుంది. లేదూ అంటే అదో కొత్త ఇబ్బంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
This post was last modified on September 14, 2022 6:41 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…