శింబు హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన వెందు తనిన్దాతు కాడు తెలుగులో ది లైఫ్ అఫ్ ముత్తుగా ఈ నెల 15న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ బుకింగ్ యాప్స్ లో టికెట్ల అమ్మకాలు కూడా మొదలుపెట్టేశారు. అంతా సవ్యంగా ఉందని ఎదురు చూస్తున్న తరుణంలో సాంకేతిక కారణాల వల్ల రెండు రోజులు ఆలస్యంగా టాలీవుడ్ వెర్షన్ ని రిలీజ్ చేయబోతున్నట్టు ఇక్కడి హక్కులు సొంతం చేసుకున్న స్రవంతి మూవీస్ అఫీషియల్ గా ప్రకటించింది. తమిళంలో మాత్రం ముందు చెప్పిన డేట్ కే వస్తుంది. ఎటొచ్చి డబ్బింగ్ దే ఆలస్యం.
సకాలంలో అనువాద కార్యక్రమాలు పూర్తి కాకపోవడం వల్లే ఈ వాయిదా తప్పలేదని వినికిడి. నిజానికి ఈ డీల్ కేవలం ఒక వారం ముందు జరిగింది. కనీసం ప్రమోషన్ చేయడానికి తగినంత టైం లేని ఒత్తిడిలో నిర్మాత రవి కిషోర్ లైఫ్ అఫ్ ముత్తుని కొన్నారు. అది కూడా శింబుకి మంచి స్నేహితుడైన హీరో రామ్ రికమండేషన్ తోనే ఇదంతా జరిగిందనే టాక్ ఉంది. శింబుకి ఇక్కడ మార్కెట్ లేదు. ఏదో ఆషామాషీగా సినిమా వదలితే ఓపెనింగ్స్ కష్టమే. ఏదో కంటెంట్ మీద నమ్మకంతో ధైర్యం చేశారు కానీ పోస్టర్లు, టీజర్ హైప్ తెచ్చేలా లేవు.
గతంలో మానాడు విషయంలోనూ అచ్చం ఇలాగే జరిగింది. ఉదయం షో పడతాయి అనంగా ఉన్నట్టుండి షోలు రద్దు చేశారు. కట్ చేస్తే అసలు రిలీజే కాలేదు. తర్వాత కొంత కాలానికి సురేష్ సంస్థ రీమేక్ హక్కులను కొనేసింది. ఇంకా మొదలుపెట్టలేదు కానీ ఈలోగా ఓటిటిలో తెలుగు ఆడియోతో సహా వచ్చినప్పుడు మన ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ది లైఫ్ అఫ్ ముత్తుకి ఆ సమస్య రాదు కానీ రెండు రోజులు లేట్ అంటే ఈలోగా కోలీవుడ్ నుంచి రిపోర్టులు రివ్యూలు వచ్చేస్తాయి. అవి పాజిటివ్ గా ఉంటే ప్లస్ అవుతుంది. లేదూ అంటే అదో కొత్త ఇబ్బంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
This post was last modified on September 14, 2022 6:41 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…