సూపర్ స్టార్ అంటే ఒకప్పుడు కృష్ణ గారే కానీ ఇప్పటి జెనరేషన్ కు మాత్రం ఆయన వారసుడు మహేష్ బాబే. అందుకే సినిమాలో కంటెంట్ బాగుంటే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్, యావరేజ్ ఉంటే మినిమమ్ సూపర్ హిట్ తో గత మూడేళ్లుగా గ్రాఫ్ మాములుగా లేదు. సర్కారు వారి పాట మీద ఎన్ని కామెంట్స్ వచ్చినా కమర్షియల్ గా పెద్ద స్కేల్ దక్కిందంటే అది ప్రిన్స్ ఇమేజ్ వల్లే. పోకిరి లాంటి పాత రీ రిలీజులతో సైతం హౌస్ ఫుల్ కలెక్షన్లు రాబట్టడం ఒక్క మహేష్ ఫ్యాన్స్ కే సాధ్యమయ్యింది. అందుకే ఇప్పుడు ఇతర హీరోల అభిమానులు కూడా తమ స్టార్ల క్లాసిక్స్ ని థియేటర్లలో వేసుకోవడం మొదలుపెట్టారు
అంతా బాగానే ఉంది కానీ ఇటీవలే మహేష్ బాబు ఒక ప్రైవేట్ ఛానల్ తో ప్రమోషన్ పరంగా ఒక ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కూతురు సితార తో కలిసి డాన్స్ రియాలిటీ షోకు అతిథిగా వెళ్ళొచ్చాడు. ఇప్పుడు అందులోనే ఒక టీవీ సీరియల్ కు ప్రచారకర్తగా కనిపించడం కొందరు సగటు ప్రేక్షకులకు అంతగా నచ్చడం లేదు. మహేష్ రేంజ్ ఐకాన్ ఇలా సీరియళ్లు చూడమని చెప్పడమేంటని వాళ్ళ కంప్లయింట్. భారీ పారితోషికం ఇచ్చినందుకు వాళ్ళ ప్రోగ్రాంలకు పబ్లిసిటీ ఇవ్వడం కరెక్టే కానీ మరీ ఇలాంటి వాటికి కాదనేది సగటు జనాల అభిప్రాయం.
ఇది రైటా రాంగా అంటే రెండింటికి ఒక్కో కోణం ఉంది. ప్రస్తుతం రెండేళ్లకు ఒక సినిమా మాత్రమే చేయగలుగుతున్న మహేష్ సేవా కార్యక్రమాల కోసం, చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం తగినంత మొత్తాన్ని సమకూర్చుకోవాలంటే ఇలాంటి ఆదాయ వనరులు వెతుక్కోవడం తప్పేమి కాదు. ఇవి చేయకపోతే డబ్బులుండవని కాదు. అదనంగా వచ్చేది ఏదైనా నలుగురి మంచికి ఉపయోగపడుతున్నప్పుడు అందులో తప్పు పట్టడానికేం లేదు. కాకపోతే స్టార్ వర్షిప్ ఎక్కువగా ఉండే దక్షిణాది రాష్ట్రాల్లో మహేష్ స్థాయి హీరో ఇలా చేయడం కొందరికి నచ్చకపోవచ్చు.
This post was last modified on September 13, 2022 10:13 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…