టాలీవుడ్లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నటుల్లో అడివి శేష్ ఒకడు. వరుసగా విజయాలు సాధిస్తున్నా.. సినిమా సినిమాకూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నా కొంచెం కూడా గర్వం తలకు ఎక్కించుకోలేదతను. కొన్ని నెలల కిందటే మేజర్ మూవీతో అతను ఎంత పెద్ద హిట్ కొట్టాడో తెలిసిందే. స్టేజ్ ఎక్కితే చాలా వినమ్రంగా మాట్లాడే అతను.. మేజర్ సక్సెస్ తర్వాత కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నాడు.
తాజాగా శేష్.. రెజీనా కసాండ్రా-నివేథా థామస్ ప్రధాన పాత్రలు పోషించిన శాకిని డాకిని మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథుల్లో ఒకడిగా వచ్చాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఈ చిత్ర నిర్మాత సునీత తాటికి క్షమాపణలు చెప్పాడు. ఇందుకు కారణమేంటో కూడా వివరించాడు.
మేజర్ మూవీ సునీత తాటి కూడా ఒక పాత్ర చేసిందట. ఇందులో శోభిత దూళిపాళ్ల తల్లిగా సునీత నటించిందట. ముంబయి తాజ్ హోటల్లో ఉగ్రదాడి సందర్భంగా చిక్కుకుపోయిన బాధితుల్లో ఒకరిగా శోభిత నటించింది. ఉగ్రవాదులు తాజ్ హోటల్లో విచక్షణా రహితంగా దాడి చేస్తున్న సమయంలో శోభతి ఫోన్లో తన ఇంట్లో వాళ్లతో మాట్లాడుతూ కనిపిస్తుంది. ఆ సన్నివేశాల్లో అవతలి నుంచి శోభిత తల్లిగా సునీత కనిపించాల్సిందట. ఆ మేరకు సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. కానీ తర్వాత నిడివి ఎక్కువ అయిపోయిందని భావించి సునీత నటించిన సన్నివేశాలన్నింటినీ తీసేయాల్సి వచ్చిందట. ఈ విషయం చెబుతూ సునీతకు సారీ చెప్పాడు శేష్.
ఈ సందర్భంగా అదేం పెద్ద విషయం కాదన్నట్లుగా స్పందించింది సునీత. ఆమె సురేష్ ప్రొడక్షన్స్తో కలిసి శాకిని డాకిని మూవీని నిర్మించింది. ఇంతకుముందు ఈ కలయికలో వచ్చిన ఓ బేబీ సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే.
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…