టాలీవుడ్లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నటుల్లో అడివి శేష్ ఒకడు. వరుసగా విజయాలు సాధిస్తున్నా.. సినిమా సినిమాకూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నా కొంచెం కూడా గర్వం తలకు ఎక్కించుకోలేదతను. కొన్ని నెలల కిందటే మేజర్ మూవీతో అతను ఎంత పెద్ద హిట్ కొట్టాడో తెలిసిందే. స్టేజ్ ఎక్కితే చాలా వినమ్రంగా మాట్లాడే అతను.. మేజర్ సక్సెస్ తర్వాత కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నాడు.
తాజాగా శేష్.. రెజీనా కసాండ్రా-నివేథా థామస్ ప్రధాన పాత్రలు పోషించిన శాకిని డాకిని మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథుల్లో ఒకడిగా వచ్చాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఈ చిత్ర నిర్మాత సునీత తాటికి క్షమాపణలు చెప్పాడు. ఇందుకు కారణమేంటో కూడా వివరించాడు.
మేజర్ మూవీ సునీత తాటి కూడా ఒక పాత్ర చేసిందట. ఇందులో శోభిత దూళిపాళ్ల తల్లిగా సునీత నటించిందట. ముంబయి తాజ్ హోటల్లో ఉగ్రదాడి సందర్భంగా చిక్కుకుపోయిన బాధితుల్లో ఒకరిగా శోభిత నటించింది. ఉగ్రవాదులు తాజ్ హోటల్లో విచక్షణా రహితంగా దాడి చేస్తున్న సమయంలో శోభతి ఫోన్లో తన ఇంట్లో వాళ్లతో మాట్లాడుతూ కనిపిస్తుంది. ఆ సన్నివేశాల్లో అవతలి నుంచి శోభిత తల్లిగా సునీత కనిపించాల్సిందట. ఆ మేరకు సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. కానీ తర్వాత నిడివి ఎక్కువ అయిపోయిందని భావించి సునీత నటించిన సన్నివేశాలన్నింటినీ తీసేయాల్సి వచ్చిందట. ఈ విషయం చెబుతూ సునీతకు సారీ చెప్పాడు శేష్.
ఈ సందర్భంగా అదేం పెద్ద విషయం కాదన్నట్లుగా స్పందించింది సునీత. ఆమె సురేష్ ప్రొడక్షన్స్తో కలిసి శాకిని డాకిని మూవీని నిర్మించింది. ఇంతకుముందు ఈ కలయికలో వచ్చిన ఓ బేబీ సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే.
This post was last modified on September 13, 2022 4:52 pm
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…