ఇటీవలే అమెరికా, బ్రిటన్ దేశాల్లో సెప్టెంబరు 3వ తేదీని నేషనల్ సినిమా డేగా జరుపుకొన్నారు. ఆ సందర్భంగా సినిమా టికెట్ ధరను తగ్గించి 3 డాలర్లకు ఫిక్స్ చేశారు. మామూలుగా టికెట్ ధర మినిమం 8 డాలర్లుంటుంది. డిమాండును బట్టి ప్రిమియర్ షోలకు 35-40 డాలర్ల రేటు కూడా పెడుతుంటారు. అలాంటిది 3 డాలర్లకు మల్టీప్లెక్సుల్లో సినిమా చూసే అవకాశం దక్కడంతో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు.
తెలుగు సినిమా అయిన కార్తికేయ-2 నాలుగో వీకెండ్లో హౌస్ ఫుల్స్తో నడిచిందంటే నేషనల్ సినిమా డే సందర్భంగా తగ్గించిన రేట్లే కారణం. ఇప్పుడు ఇండియాలో కూడా నేషనల్ సినిమా డేను జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 16న ఇందుకు ముహూర్తం కుదిరింది. ఈ సందర్భంగా మల్టీప్లెక్సులన్నింట్లోనూ రూ.75 రేటును ఫిక్స్ చేశారు.
ఈ మేరకు కొన్ని రోజుల ముందే ప్రకటన రావడంతో సినీ ప్రియులు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఐతే కారణాలేంటో ఏమో కానీ.. సెప్టెంబరు 16న నేషనల్ సినిమా డేను జరుపుకోవడం లేదు. దీన్ని వారం వాయిదా వేశారు. సెప్టెంబరు 23కు ఫిక్స్ చేశారు. ఆ రోజే జాతీయ సినీ వేడుకలు జరగనున్నాయి. టికెట్ ధర రూ..75 ఉండబోతోంది ఆ శుక్రవారం రోజు.
ఈ ఏడాది చివర్లో అవతార్-2 రిలీజ్ కానున్న నేపథ్యంలో అవతార్-2ను 23నే రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీతో రీమాస్టర్ చేసి రిలీజ్ చేస్తుండడంతో ఆ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. అదే రోజు టికెట్ ధరను రూ.75కు తగ్గిస్తుండడంతో అవతార్ థియేటర్లు జనాలతో నిండిపోవడం ఖాయం. అదే రోజు రిలీజయ్యే వేరే చిత్రాలకు కూడా మంచి ఆక్యుపెన్సీనే ఉండొచ్చు.
This post was last modified on September 13, 2022 4:46 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…