ఇటీవలే అమెరికా, బ్రిటన్ దేశాల్లో సెప్టెంబరు 3వ తేదీని నేషనల్ సినిమా డేగా జరుపుకొన్నారు. ఆ సందర్భంగా సినిమా టికెట్ ధరను తగ్గించి 3 డాలర్లకు ఫిక్స్ చేశారు. మామూలుగా టికెట్ ధర మినిమం 8 డాలర్లుంటుంది. డిమాండును బట్టి ప్రిమియర్ షోలకు 35-40 డాలర్ల రేటు కూడా పెడుతుంటారు. అలాంటిది 3 డాలర్లకు మల్టీప్లెక్సుల్లో సినిమా చూసే అవకాశం దక్కడంతో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు.
తెలుగు సినిమా అయిన కార్తికేయ-2 నాలుగో వీకెండ్లో హౌస్ ఫుల్స్తో నడిచిందంటే నేషనల్ సినిమా డే సందర్భంగా తగ్గించిన రేట్లే కారణం. ఇప్పుడు ఇండియాలో కూడా నేషనల్ సినిమా డేను జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 16న ఇందుకు ముహూర్తం కుదిరింది. ఈ సందర్భంగా మల్టీప్లెక్సులన్నింట్లోనూ రూ.75 రేటును ఫిక్స్ చేశారు.
ఈ మేరకు కొన్ని రోజుల ముందే ప్రకటన రావడంతో సినీ ప్రియులు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఐతే కారణాలేంటో ఏమో కానీ.. సెప్టెంబరు 16న నేషనల్ సినిమా డేను జరుపుకోవడం లేదు. దీన్ని వారం వాయిదా వేశారు. సెప్టెంబరు 23కు ఫిక్స్ చేశారు. ఆ రోజే జాతీయ సినీ వేడుకలు జరగనున్నాయి. టికెట్ ధర రూ..75 ఉండబోతోంది ఆ శుక్రవారం రోజు.
ఈ ఏడాది చివర్లో అవతార్-2 రిలీజ్ కానున్న నేపథ్యంలో అవతార్-2ను 23నే రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీతో రీమాస్టర్ చేసి రిలీజ్ చేస్తుండడంతో ఆ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. అదే రోజు టికెట్ ధరను రూ.75కు తగ్గిస్తుండడంతో అవతార్ థియేటర్లు జనాలతో నిండిపోవడం ఖాయం. అదే రోజు రిలీజయ్యే వేరే చిత్రాలకు కూడా మంచి ఆక్యుపెన్సీనే ఉండొచ్చు.
This post was last modified on September 13, 2022 4:46 pm
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…