ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రాజమౌళి హవా నడుస్తోంది. ఆయనకు మరే దర్శకుడూ దరిదాపుల్లో లేడు. ఆయన పట్టిందల్లా బంగారమే అవుతోంది. బాహుబలి తర్వాత మళ్లీ బాక్సాఫీస్ దగ్గర అలాంటి మ్యాజిక్ చేయడం జక్కన్న వల్ల కాదనుకున్నారు కానీ.. ఆర్ఆర్ఆర్తో దానికి దీటైన విజయమే దక్కించుకున్నాడు రాజమౌళి. ఈ సినిమాతో బాహుబలిని మించి అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించాడాయన.
ఈ విజయాన్ని ఆస్వాదిస్తుండగానే.. ఇప్పుడు జక్కన్న ఖాతాలోకి మరో ఘనవిజయం జమ అయింది. అదే.. బ్రహ్మాస్త్ర. ఈ చిత్రానికి దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడమే కాక.. ఇక్కడ మేజర్ సిటీల్లో సినిమాను గట్టిగా ప్రమోట్ చేశాడు. ఆన్ లైన్లో కూడా ప్రమోషన్ బాగానే చేశాడు.
ఐతే రాజమౌళి ఏ ప్రయోజనం లేకుండా బ్రహ్మాస్త్ర కోసం ఇంత కష్టపడలేదు. తన మిత్రుడైన బళ్లారి సాయితో కలిసి ఈ చిత్రాన్ని ఏపీ వరకు రాజమౌళే డిస్ట్రిబ్యూట్ చేశాడు. డబ్బులు సాయివి కాగా.. తన బ్రాండ్ను ఉపయోగించడం, అలాగే ప్రమోషన్లు చేయడం ద్వారా లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు జక్కన్న. ఆయన పేరు సినిమాకు బాగానే ఉపయోగపడింది.
బ్రహ్మాస్త్ర తెలుగులో హిందీ చిత్రాల వసూళ్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది. తొలి వీకెండ్లో రూ.15 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఏపీలో ఆల్రెడీ సినిమాకు బ్రేక్ ఈవెన్ అయిపోయింది. లాభాల బాట పట్టేసింది. వీకెండ్ తర్వాత కూడా బ్రహ్మాస్త్రకు మంచి వసూళ్లే వస్తున్నాయి. ఫుల్ రన్లో పెట్టుబడి మీద రెట్టింపు ఆదాయం అందించేలా ఉంది. కాబట్టి జక్కన్న ఈ చిత్రంతో నక్కతోక తొక్కినట్లే.
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో ప్రముఖ నాయకుడు, దివంగత వంగవీటి రంగా కుమార్తె..…
కొన్నిసార్లు అంతే అనుకోకుండా అదృష్టం తలుపు తట్టేస్తుంది. దాన్ని వాడుకోవడం తెలిసుండాలి అంతే. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి తీస్తున్న…
దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంత సెలెక్టివ్ గా ఉంటారో తెలిసిందే. కథలు, క్యాస్టింగ్, టీమ్, కంటెంట్ ఏదైనా సరే రాజీ…