విడుదలకు ముందు సోషల్ మీడియాలో కారణం లేకుండా విపరీతమైన నెగెటివిటీ.. దీనికి తోడు ట్రైలర్కు మిశ్రమ స్పందన.. గ్రాఫిక్స్ మీద విమర్శలు.. తొలి రోజు టాక్ కూడా కొంచెం డివైడ్గానే వచ్చింది. కానీ ఈ ప్రతికూలతలన్నింటినీ దాటుకుని బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడింది. కలెక్షన్ల పరంగా రికార్డుల మోత మోగిస్తూ వీకెండ్ను పూర్తి చేసుకుంది.
తొలి రోజు, అలాగే తొలి వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా బ్రహ్మాస్త్ర రికార్డులు నెలకొల్పడం విశేషం. కరోనా బ్రేక్ తర్వాత ఓ మోస్తరు ఓపెనింగ్స్ సాధించడం కూడా కష్టమైపోతున్న పరిస్థితుల్లో ఈ సినిమా ఇండియా వైడ్ రూ.125 కోట్లు, వరల్డ్ వైడ్ రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం గొప్ప విషయమే.
రణబీర్ కపూరే హీరోగా నటించిన సంజు సినిమా ఇండియాలో రూ.120 కోట్లతో వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పగా.. దాని కన్నా 5 కోట్లు ఎక్కువ వసూళ్లు రాబట్టి బ్రహ్మాస్త్ర కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ రకంగా తన రికార్డును రణబీరే బద్దలు కొట్టినట్లయింది. యుఎస్ సహా పలు దేశాల్లో బ్రహ్మాస్త్ర భారీ వసూళ్లు సాధిస్తోఓంది. మొత్తంగా చూస్తే బ్రహ్మాస్త్రకు బాక్సాఫీస్ దగ్గర అదిరే ఆరంభం లభించిందన్నది వాస్తవం.
కాకపోతే ఆరంభ శూరత్వానికి పరిమితం అయితే కష్టమే అవుతుంది. ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్లకు పైమాటే. థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరిగింది. వరల్డ్ వైడ్ రూ.600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే ఇది బ్రేక్ ఈవెన్ అవుతుంది. అది జరగాలంటే సినిమా చాలా రోజులు థియేటర్లలో నిలవాలి. నిలకడగా వసూళ్లు సాధించాలి. ఆదివారం తర్వాత మేజర్ డ్రాప్ లేకపోవడం, సోమవారం కూడా ఓ మోస్తరు వసూళ్లు సాధించడంతో పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ.. డివైడ్ టాక్ నేపథ్యంలో సినిమాకు లాంగ్ రన్ ఉంటుందా లేదా అన్నదే సందేహంగా మారింది.
This post was last modified on September 12, 2022 9:14 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…