సూపర్ గుడ్ ఫిలిమ్స్.. దక్షిణాదిన లెజెండరీ స్టేటస్ ఉన్న బ్యానర్. 80, 90 దశకాల్లో అటు తమిళంలో ఇటు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించింది ఈ సంస్థ. రాజా, సూర్యవంశం, నువ్వు వస్తావని… ఇలా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన కల్ట్ మూవీస్ జాబితా పెద్దదే.
అయితే 2000 తర్వాత ఎదురైన కొన్ని పరాజయాల కారణంగా ఈ సంస్థ జోరు తగ్గింది. గత దశాబ్ద కాలంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పేరు పెద్దగా వినిపించలేదు. ఇటీవల ఆ సంస్థ మళ్లీ యాక్టివ్ అవుతోంది. తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సూపర్ గుడ్ వారి సినిమానే. తమిళంలోనూ ఆ సంస్థ ఒకటి రెండు సినిమాలు నిర్మిస్తోంది.
కాగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వందో సినిమాకు చేరువ అవుతుండటం విశేషం. దాని గురించి తాజా కబురు బయటికి వచ్చింది. ఈ మైల్ స్టోన్ మూవీలో దళపతి విజయ్ కథానాయకుడిగా నటించనున్నాడు. ఈ విషయాన్ని సూపర్ గుడ్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జీవా వెల్లడించాడు. తమ సంస్థ వందో సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు అతను తెలిపాడు.
ఈ చిత్రంలో తాను కూడా నటించే అవకాశాలు ఉన్నట్లు కూడా అతను వెల్లడించాడు. తాను పారితోషికం కూడా తీసుకోనని, ఈ సినిమాలో నటించే అవకాశం ఇవ్వమని తన తండ్రికి తెలిపినట్టు జీవా చెప్పడం విశేషం. అయితే ఈ సినిమాకు దర్శకుడు, కథ ఏమీ లాక్ కానట్లే ఉంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. గతంలో సూపర్ గుడ్ సంస్థ లో విజయ్ కొన్ని బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. అతను నటించిన శుభాకాంక్షలు, నువ్వు వస్తావని తమిళ వెర్షన్లు సూపర్ గుడ్ సంస్థ నిర్మించినవే.
This post was last modified on September 12, 2022 9:11 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. విడుదల…
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి…
దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…
నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…
తమిళనాట ఎవరి అంచనాకు అందని విదంగా దళపతి విజయ్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన అధికారంలోకి…
దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందుంటాయి.…