Movie News

ప‌న్నెండేళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌

టాలీవుడ్లో అభిమానులు అత్యంత ఆస‌క్తితో ఎదురు చూస్తున్న కాంబినేష‌న్ల‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు-మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ల‌ది ఒక‌ట‌న‌డంలో సందేహం లేదు. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి చిత్రం అత‌డు క‌మ‌ర్షియ‌ల్‌గా అనుకున్నంత స‌క్సెస్ కాలేదు.

రెండో చిత్రం ఖ‌లేజా అయితే డిజాస్ట‌ర్ అయింది. కానీ ఆ రెండు చిత్రాలూ త‌ర్వాతి కాలంలో క‌ల్ట్ స్టేట‌స్ అందుకున్నాయి. టీవీల్లో, ఓటీటీల్లో ఈ సినిమాల‌ను విర‌గ‌బ‌డి చూస్తుంటారు జ‌నం. అప్ప‌టి బాక్సాఫీస్ ప‌రిస్ఙితుల నేప‌థ్యంలో ఈ సినిమాలు స‌రిగా ఆడ‌లేదు కానీ.. అప్పుడు మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ జ‌త క‌డితే బ్లాక్‌బ‌స్ట‌ర్ రావ‌డం గ్యారెంటీ అనే న‌మ్మ‌కంతో ప్రేక్ష‌కులున్నారు. ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వీరి క‌ల‌యిక‌లో మూడో సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. గ‌త ఏడాది సినిమా అనౌన్స్ అయినా స‌రే.. మొద‌లు కావ‌డంలో ఆల‌స్యం జ‌రిగింది.

ఐతే ఖ‌లేజా త‌ర్వాత ప‌న్నెండేళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ ఈ క‌ల‌ల చిత్రం ఎట్ట‌కేల‌కు సెట్స్ మీదికి వెళ్లింది. సోమ‌వార‌మే హైద‌రాబాద్‌లో ఎస్ఎస్ఎంబీ28కు శ్రీకారం చుట్టారు. ఒక భారీ సెట్లో యాక్ష‌న్ ఘ‌ట్టంతో ఈ సినిమా షూటింగ్ మొద‌లుపెట్టారు. ఈ షెడ్యూల్లో మేజ‌ర్ పార్ట్ యాక్ష‌న్ సీక్వెన్సేన‌ట‌. అది కాక కొన్ని స‌న్నివేశాలేవో తీస్తార‌ట‌. మ‌హేష్ పూర్తిగా ఈ షెడ్యూల్‌కు అందుబాటులో ఉండ‌నున్నాడు. రెండో షెడ్యూల్ నుంచి హీరోయిన్ పూజా హెగ్డే జాయిన్ అవుతుంది.

షూటింగ్ మొద‌లుపెట్ట‌డంలో కొంత ఆల‌స్యం జ‌రిగిన‌ప్ప‌టికీ.. రాబోయే ఐదారు నెల‌ల‌కు ప‌క్కాగా షెడ్యూల్స్ సిద్ధం అయిన‌ట్లు స‌మాచారం. ఈ మ‌ధ్య ప్ర‌క‌టించిన‌ట్లే వ‌చ్చే ఏడాది వేస‌వి కానుక‌గా, పోకిరి డేట్ అయిన ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త్రివిక్ర‌మ్ మాతృ సంస్థ అన‌ద‌గ్గ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

This post was last modified on September 12, 2022 6:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈడీ దెబ్బ‌.. వైసీపీలో కుదుపు.. !

వైసీపీ అధినేత జగ‌న్‌కు ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్(ఈడీ) దెబ్బ కొత్త‌కాదు. ఆయ‌నకు సంబంధించిన ఆస్తుల కేసులో ఈడీ అనేక మార్లు ఆయ‌న‌ను…

4 minutes ago

తిరుమల కొండపై ఇక ‘చైనీస్’ దొరకదు!

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న…

1 hour ago

హిట్ 3 విలన్ వెనుక ఊహించని విషాదం

గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల…

1 hour ago

కశ్మీర్ లోని ఏపీ విద్యార్థుల భద్రతపై ఫోకస్

భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ జనం చిక్కుబడిపోయారు.…

2 hours ago

తెలుగు జవాన్ మురళి వీర మరణం

పాకిస్తాన్ తో భారత యుద్ధం అంతకంతకూ భీకరంగా మారుతోంది. తొలుత ఉగ్రదాడి, ఆ తర్వాత కవ్వింపు చర్యలకు దిగిన పాక్..…

2 hours ago

బిగ్ బ్రేకింగ్: ఐపీఎల్‌కు బ్రేక్… బీసీసీఐ సంచలన నిర్ణయం

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్టు…

3 hours ago