టాలీవుడ్లో అభిమానులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న కాంబినేషన్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్లది ఒకటనడంలో సందేహం లేదు. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం అతడు కమర్షియల్గా అనుకున్నంత సక్సెస్ కాలేదు.
రెండో చిత్రం ఖలేజా అయితే డిజాస్టర్ అయింది. కానీ ఆ రెండు చిత్రాలూ తర్వాతి కాలంలో కల్ట్ స్టేటస్ అందుకున్నాయి. టీవీల్లో, ఓటీటీల్లో ఈ సినిమాలను విరగబడి చూస్తుంటారు జనం. అప్పటి బాక్సాఫీస్ పరిస్ఙితుల నేపథ్యంలో ఈ సినిమాలు సరిగా ఆడలేదు కానీ.. అప్పుడు మహేష్-త్రివిక్రమ్ మళ్లీ జత కడితే బ్లాక్బస్టర్ రావడం గ్యారెంటీ అనే నమ్మకంతో ప్రేక్షకులున్నారు. రకరకాల కారణాల వల్ల వీరి కలయికలో మూడో సినిమా పట్టాలెక్కలేదు. గత ఏడాది సినిమా అనౌన్స్ అయినా సరే.. మొదలు కావడంలో ఆలస్యం జరిగింది.
ఐతే ఖలేజా తర్వాత పన్నెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ కలల చిత్రం ఎట్టకేలకు సెట్స్ మీదికి వెళ్లింది. సోమవారమే హైదరాబాద్లో ఎస్ఎస్ఎంబీ28కు శ్రీకారం చుట్టారు. ఒక భారీ సెట్లో యాక్షన్ ఘట్టంతో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్లో మేజర్ పార్ట్ యాక్షన్ సీక్వెన్సేనట. అది కాక కొన్ని సన్నివేశాలేవో తీస్తారట. మహేష్ పూర్తిగా ఈ షెడ్యూల్కు అందుబాటులో ఉండనున్నాడు. రెండో షెడ్యూల్ నుంచి హీరోయిన్ పూజా హెగ్డే జాయిన్ అవుతుంది.
షూటింగ్ మొదలుపెట్టడంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ.. రాబోయే ఐదారు నెలలకు పక్కాగా షెడ్యూల్స్ సిద్ధం అయినట్లు సమాచారం. ఈ మధ్య ప్రకటించినట్లే వచ్చే ఏడాది వేసవి కానుకగా, పోకిరి డేట్ అయిన ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ మాతృ సంస్థ అనదగ్గ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
This post was last modified on September 12, 2022 6:50 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…