తనయుడు నటుడిగా పేరు తెచ్చుకుని దేశ వ్యాప్తంగా పాపులర్ అయినా కానీ ఇంత వరకు రానా దగ్గుబాటితో పెద్ద సినిమా చేయలేదు సురేష్ బాబు. ఎప్పట్నుంచో హిరణ్య కశ్యప సినిమా చేయాలని చూస్తున్నారు.
రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ ఈ కథ మీదే కసరత్తు చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ కూడా పెట్టుకున్నారు. ఆమధ్య రానా ఆరోగ్య కారణాల వల్ల ఈ చిత్రం మొదలు కాలేదు. ఇప్పుడు మళ్ళీ రానా చురుగ్గా ఉండడంతో అది చేయడానికి ఇదే తగిన సమయం అనుకున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోతున్న సురేష్ బాబు ఇప్పట్లో అంత భారీ సినిమా తలపెట్టడం తగదని భావిస్తున్నారట.
వెంకటేష్, రాణాలతో సింపుల్ సినిమాలు తీసుకుని రెండేళ్ల తర్వాత పరిస్థితులు మాములు స్థితికి వచ్చాక అప్పుడు హిరణ్య కశ్యప చేసుకోవడం ఉత్తమం అనుకుంటున్నారట. మరి అంతవరకూ గుణశేఖర్ ఆగుతాడా లేక వేరే హీరో, నిర్మాతని వెతుక్కుంటాడా అనేది వేచి చూడాల్సిందే.
This post was last modified on April 22, 2020 1:46 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…