తనయుడు నటుడిగా పేరు తెచ్చుకుని దేశ వ్యాప్తంగా పాపులర్ అయినా కానీ ఇంత వరకు రానా దగ్గుబాటితో పెద్ద సినిమా చేయలేదు సురేష్ బాబు. ఎప్పట్నుంచో హిరణ్య కశ్యప సినిమా చేయాలని చూస్తున్నారు.
రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ ఈ కథ మీదే కసరత్తు చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ కూడా పెట్టుకున్నారు. ఆమధ్య రానా ఆరోగ్య కారణాల వల్ల ఈ చిత్రం మొదలు కాలేదు. ఇప్పుడు మళ్ళీ రానా చురుగ్గా ఉండడంతో అది చేయడానికి ఇదే తగిన సమయం అనుకున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోతున్న సురేష్ బాబు ఇప్పట్లో అంత భారీ సినిమా తలపెట్టడం తగదని భావిస్తున్నారట.
వెంకటేష్, రాణాలతో సింపుల్ సినిమాలు తీసుకుని రెండేళ్ల తర్వాత పరిస్థితులు మాములు స్థితికి వచ్చాక అప్పుడు హిరణ్య కశ్యప చేసుకోవడం ఉత్తమం అనుకుంటున్నారట. మరి అంతవరకూ గుణశేఖర్ ఆగుతాడా లేక వేరే హీరో, నిర్మాతని వెతుక్కుంటాడా అనేది వేచి చూడాల్సిందే.
This post was last modified on April 22, 2020 1:46 pm
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…