లైగర్ సినిమా విడుదలకు ముందు విజయ్ దేవరకొండ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ సినిమా వసూళ్ల లెక్క రూ.200 కోట్లతో మొదలవుతుందని.. ఇండియాను ఈ చిత్రం షేక్ చేసేస్తుందని.. ఇలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లే ఇచ్చాడు. కానీ తెరపై బొమ్మ చూసిన వాళ్లకు దిమ్మదిరిగిపోయింది. ఈ సినిమాకా ఇంత ఎలివేషన్ ఇచ్చాడంటూ విజయ్ని సోషల్ మీడియాలో మామూలుగా ఆడుకోలేదు జనాలు. రెండో రోజుకే లైగర్ థియేటర్లు వెలవెలబోయి సినిమా పెద్ద డిజాస్టర్ దిశగా అడుగులు వేయడంతో విజయ్ సైలెంట్ అయిపోయాడు. ఆన్ లైన్లో అసలు చప్పుడే లేదు. ఆఫ్ లైన్లోనూ విజయ్ పెద్దగా సందడి చేయలేదు.
ఐతే కొంచెం గ్యాప్ తర్వాత అతను మీడియా కళ్లకు చిక్కాడు. బెంగళూరులో సైమా పదో వార్షికోత్సవ వేడుకలకు విజయ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతణ్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగాలని చూసింది.
ఇందులో భాగంగా జనగణమన గురించి ఓ విలేకరి అడిగారు. లైగర్ తర్వాత పూరి-విజయ్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన ఈ సినిమాకు కొన్ని నెలల కిందట ఘనంగా ప్రారంభోత్సవం జరగడం తెలిసిందే. ఐతే లైగర్ డిజాస్టర్ కావడంతో ఈ సినిమా ఆగిపోయినట్లు జోరుగా వార్తలొస్తున్నాయి. కాకపోతే విజయ్ కానీ, పూరి కానీ అధికారికంగా ఈ సినిమాపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఈ నేపథ్యంలో విజయ్ని ఈ సినిమా గురించి అడిగితే అతను సమాధానం దాటవేశాడు. మనం వచ్చిన సైమా వేడుకలను ఎంజాయ్ చేయడానికి, దానికే పరిమితం అవుదాం అని అతను బదులిచ్చాడు. మామూలుగా తన ఫెయిల్యూర్ల గురించి విజయ్ మాట్లాడడానికి ఎలాంటి ఇబ్బందీ పడడు. ఇబ్బందికర ప్రశ్నలకు కూడా ఈజీగా ఆన్సర్ చేస్తాడు. అలాంటిది జనగణమన గురించి అడిగితే సమాధానం చెప్పలేక దాటవేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. లైగర్ ఎఫెక్ట్ అతడిపై ఏ స్థాయిలో పడిందో చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి?
This post was last modified on September 12, 2022 7:30 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…