మామూలుగా చూస్తే డబ్బు విలువ తగ్గొచ్చు కానీ.. సినిమాలకు రోజు రోజుకు వసూళ్ల లెక్క పెరగడమే తప్ప తగ్గడం అన్నది ఉండదు. కానీ కరోనా పుణ్యమా అని హిందీ సినిమాల పరిస్థితి దీనికి భిన్నంగా తయారయింది. అక్కడ పెద్ద హీరోల సినిమాలకు తొలి రోజు 30-40 కోట్ల వసూళ్లు అనేది చాలా సామాన్యమైన విషయంగా ఉండేది.
కానీ కరోనా తర్వాత అందులో పది ఇరవై శాతానికి వసూలు పడిపోయాయి. తొలి రోజు వసూళ్లు 10 కోట్లు దాటితేనే మురిసిపోయే పరిస్థితి వచ్చింది. ఇoదుకు కారణాలు ఏంటి అన్నది పక్కన పెడితే బాలీవుడ్ పాత రోజులకు వెళ్ళదేమో అన్న భయాలు పట్టుకున్నాయి. కానీ బ్రహ్మాస్త్ర సినిమా మళ్లీ బాలీవుడ్ కు పునర్వైభవం తెచ్చిపెట్టింది.
తొలి రోజు వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలిపి 75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన బ్రహ్మాస్త్ర.. రెండో రోజు కూడా తగ్గలేదు. డివైడ్ టాక్ ను తట్టుకుని నిలబడ్డ ఈ చిత్రం శనివారం ఓవరాల్ గా 50 కోట్ల దాకా వసూలు రాబట్టినట్లు ట్రేడ్ పండితుల అంచనా. ఆదివారం కూడా సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరిగాయి. తొలి రెండు రోజులకు దీటుగా మూడో రోజు వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. బ్రహ్మాస్త్ర ఆల్రెడీ 100 కోట్ల మార్కును దాటేసింది. రెండు వందల కోట్ల క్లబ్బు వైపు పరుగులు పెడుతోంది. వీకెండ్ అయ్యాక మేజర్ డ్రాప్ లేకపోతే సినిమా అడుగులు వేస్తున్నట్లే.
విడుదలకు ముందు బాయ్ కాట్ బ్యాచ్ నుంచి విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొని.. రిలీజ్ తర్వాత డివైడ్ టాక్ ను తట్టుకుని సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది అంటే గొప్ప విషయమే. బ్రహ్మస్త్ర రిజల్ట్ కచ్చితంగా బాలీవుడ్ కు గొప్ప రిలీఫ్ అనడంలో సందేహం లేదు. రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ముఖ్య పాత్రలు పోషించిన బ్రహ్మాస్త్ర చిత్రాన్ని అయాన్ ముఖర్జీ రూపొందించాడు. కరణ్ జోహార్ నిర్మాత.
This post was last modified on September 11, 2022 5:46 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…