Movie News

పరువు తీసుకున్న కంగనా

తరచుగా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయకపోతే వార్తల్లో నిలవకపోతే కంగనా రనౌత్ కు నిద్రపట్టదు ఏమో. తాజాగా ఆమె అత్యుత్సాహం తన పరువు తానే తీసుకునేలా చేసింది. ఈ శుక్రవారం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు ముందు నుంచి ఉన్న హైప్ వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. తొలి రోజు జనం సినిమా కోసం ఎగబడ్డారు. కంగనా ఇవేవీ పట్టించుకోకుండా సినిమా పెద్ద డిజాస్టర్ అని తేల్చేసింది. సుమిత్ కడెల్ అనే బాలీవుడ్ క్రిటిక్ బ్రహ్మాస్త్ర మూవీకి సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చినట్లు, సినిమాను తీవ్రంగా విమర్శించినట్లు ఒక ట్వీట్ను పోస్ట్ చేసింది.

కానీ అసలు విషయం ఏమిటంటే కంగనా కోట్ చేసిన ట్విట్టర్ అకౌంట్ ఫేక్. అది సుమిత్ అకౌంట్ కాదు. నిజానికి సుమిత్ బ్రహ్మాస్త్ర మూవీ కి త్రీ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. సినిమాను కొనియాడాడు. అయితే రివ్యూలు ఎలా ఉన్నాయి అన్నది పక్కన పెడితే బ్రహ్మాస్త్రకు తొలి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా ఇండియా వరకే 43 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్ కలెక్షన్ 75 కోట్ల రూపాయల దాకా వచ్చింది. శనివారం కూడా బుకింగ్స్ బాగున్నాయి. ఆదివారం కూడా వసూళ్లకు డోకా లేకపోవచ్చు. కాబట్టి కంగనా చెప్పినట్లు బ్రహ్మాస్త్ర డిజాస్టర్ అయ్యే అవకాశాలు లేవు. దీంతో ఆమె వాదన తుస్సుమన్నట్లే.

ఇంకోవైపు ఏమో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ పోస్టు షేర్ చేస్తూ సినిమాను విమర్శించడం వల్ల ఆ రకంగానూ ఆమె పరువు పోయింది. అయినా ఈమధ్య ధకడ్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఘోరపరాభవం ఎదుర్కొన్న కంగనా.. మంచి వసూళ్లు సాధిస్తున్న వేరే సినిమా మీద ఏడవడం ఏంటో?

This post was last modified on September 10, 2022 3:27 pm

Share

Recent Posts

నాగార్జున నమ్మకం ఎక్కడ తప్పింది

చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…

1 hour ago

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

4 hours ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

6 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

7 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

7 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

7 hours ago