తరచుగా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయకపోతే వార్తల్లో నిలవకపోతే కంగనా రనౌత్ కు నిద్రపట్టదు ఏమో. తాజాగా ఆమె అత్యుత్సాహం తన పరువు తానే తీసుకునేలా చేసింది. ఈ శుక్రవారం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాకు ముందు నుంచి ఉన్న హైప్ వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. తొలి రోజు జనం సినిమా కోసం ఎగబడ్డారు. కంగనా ఇవేవీ పట్టించుకోకుండా సినిమా పెద్ద డిజాస్టర్ అని తేల్చేసింది. సుమిత్ కడెల్ అనే బాలీవుడ్ క్రిటిక్ బ్రహ్మాస్త్ర మూవీకి సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చినట్లు, సినిమాను తీవ్రంగా విమర్శించినట్లు ఒక ట్వీట్ను పోస్ట్ చేసింది.
కానీ అసలు విషయం ఏమిటంటే కంగనా కోట్ చేసిన ట్విట్టర్ అకౌంట్ ఫేక్. అది సుమిత్ అకౌంట్ కాదు. నిజానికి సుమిత్ బ్రహ్మాస్త్ర మూవీ కి త్రీ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. సినిమాను కొనియాడాడు. అయితే రివ్యూలు ఎలా ఉన్నాయి అన్నది పక్కన పెడితే బ్రహ్మాస్త్రకు తొలి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా ఇండియా వరకే 43 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్ కలెక్షన్ 75 కోట్ల రూపాయల దాకా వచ్చింది. శనివారం కూడా బుకింగ్స్ బాగున్నాయి. ఆదివారం కూడా వసూళ్లకు డోకా లేకపోవచ్చు. కాబట్టి కంగనా చెప్పినట్లు బ్రహ్మాస్త్ర డిజాస్టర్ అయ్యే అవకాశాలు లేవు. దీంతో ఆమె వాదన తుస్సుమన్నట్లే.
ఇంకోవైపు ఏమో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ పోస్టు షేర్ చేస్తూ సినిమాను విమర్శించడం వల్ల ఆ రకంగానూ ఆమె పరువు పోయింది. అయినా ఈమధ్య ధకడ్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఘోరపరాభవం ఎదుర్కొన్న కంగనా.. మంచి వసూళ్లు సాధిస్తున్న వేరే సినిమా మీద ఏడవడం ఏంటో?
This post was last modified on September 10, 2022 3:27 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…