‘హిట్’ సినిమాతో టాలీవుడ్లోకి దర్శకుడిగా సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు శైలేష్ కొలను. పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ కూడా అందుకున్న ఈ శాస్త్రవేత్త సినిమాల మీద విపరీతమైన ఆసక్తితో తన కెరీర్ను వదులుకుని ఇటువైపు అడుగులేశాడు. ‘హిట్’ సినిమాను పకడ్బందీగా తీసి, హిట్టు కొట్టి ఫిలిం ఇండస్ట్రీ వైపు రావడం సరైన నిర్ణయమే అని చాటిచెప్పాడు.
ఇప్పుడతను నాని కోసం ఓ కథ రాస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మధ్యలో ఓ సినిమా చేశాక.. ‘హిట్’ సీక్వెల్ తీస్తాడంటున్నారు. శైలేష్కు థ్రిల్లర్ కథల మీద ఉన్న పట్టేంటో తొలి సినిమాతోనే రుజువైంది. తర్వాతి సినిమా కూడా ఆ జానర్లోనే ఉండొచ్చంటున్నారు. ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ వేళ తన కొత్త సినిమాకు కథ రాసుకుంటూనే.. ట్విట్టర్లో సరదాగా వేరే దర్శకులను ఎంగేజ్ చేస్తూ ఓ కథను డెవలప్ చేసే ప్రయత్నంలో పడ్డాడు శైలేష్.
ఓ థ్రిల్లర్ కథకు ట్విట్టర్ ద్వారా శ్రీకారం చుట్టి.. ఈ కథను ఇంకా ముందుకు తీసుకెళ్లమంటూ టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్లను లైన్లోకి తీసుకొచ్చాడతను. ముందుగా శైలేష్ మొదలు పెట్టిన కథ ఎలా ఉందో చూద్దాం. విఘ్నేష్ అనే 42 ఏళ్ల వ్యక్తి తెల్లవారుజామున 5.30 నిమిషాలకు ఇంటి వెనుక నుంచి వచ్చిన పెద్ద శబ్దం విని నిద్ర లేస్తాడు. లివింగ్ రూం ద్వారా వెళ్లి వెనుక డోర్ తీస్తాడు.
ఇక్కడి నుంచి కథను కొనసాగించమంటూ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ను అతను ఛాలెంజ్ చేశాడు. అతనేమో.. ‘‘దూరం నుంచి తన భార్య అరుపు విన్నాడు. విఘ్నేష్ పరుగెత్తుకుని వెళ్లగా.. భార్యను ముగ్గురు మహిళలు బలవంతంగా కారులోకి ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యం కనిపించింది. వాళ్లు ఎక్కింది పచ్చ రంగు వింటేజ్ కారు. దాని మీద ప్రీతి అని రాసి ఉంది’’.. అంటూ తన వరకు కథను డెవలప్ చేసి ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహాకు ఛాలెంజ్ విసిరాడు.
అతను ఇంకొంత కథను ముందుకు తీసుకెళ్లి ఇంద్రగంటి మోహనకృష్ణకు అప్పగించాడు. ఆయన ఇంకాస్త కథను డెవలప్ చేసి అసవరాల శ్రీనివాస్కు కొనసాగించే పని అప్పగించాడు. అక్కడితో బ్రేక్ పడింది. అవసరాల ఇంకా స్పందించలేదు. ఇప్పటిదాకా కథ మంచి షేప్ తీసుకుందని.. అవసరాల ఏం చేస్తాడో చూద్దామని శైలేష్ తాజాగా ట్వీట్ చేశాడు. వీళ్లు ఇలా డెవలప్ చేసిన కథను సరదాగా సినిమా కూడా తీసి పడేస్తారేమో చూడాలి మరి.
This post was last modified on April 22, 2020 1:42 pm
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…