సినీ రంగంలో చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ కొద్దిమంది మాత్రమే తమ స్నేహ బంధం ఎంత గాఢమైందో బహిరంగ వేదిక మీద చాటుతుంటారు. మోహన్ బాబు రజినీకాంత్ ప్రస్తావన వస్తే ఎప్పుడూ కూడా ఒరేయ్, వాడు అనే సంబోధిస్తుంటాడు. కానీ రజినీ మాత్రం ఇలా మాట్లాడడు.
ఇక టాలీవుడ్ యువ కథానాయకుల్లో చాలామంది ఒకరినొకరు రేయ్ అని పిలుచుకుంటుంటారు కానీ.. వేదికల మీద చాలా వరకు ఒకరినొకరు మర్యాదగానే సంబోధిస్తారు. ఐతే యంగ్ హీరో శర్వానంద్ మాత్రం.. తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వెన్నెల కిషోర్ను తన కొత్త చిత్రం ఒకే ఒక జీవితం ప్రెస్ మీట్ సందర్భంగా సంబోధించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్రంలో కిషోర్ కూడా ముఖ్య పాత్ర పోషించగా.. వేరే షూటింగ్ ఉండడం వల్ల ఈ ఈవెంట్కు రాలేకపోయాడు.
ఐతే కారణమేదైనప్పటికీ కిషోర్ ఈ కార్యక్రమానికి రాకపోవడంతో శర్వాకు కోపం వచ్చింది. కానీ అది ప్రేమతో కూడిన కోపమే. అతను రాకపోవడంపై స్పందిస్తూ.. ఆ నా కొడుకు అయిపోయాడు. ఒరే వెన్నెల కిషోర్గా నీ సంగతి చూస్కుంటా. వాడికి ఈ సినిమా ఇప్పించింది కూడా నేనే. కానీ వాడు ఈ ఈవెంట్కు రాలేదు అన్నాడు. కాకపోతే మాటల్లో ఉన్నంత తీవ్రత ముఖంలో కనిపించలేదు. శర్వా నవ్వుతూనే ఈ మాటలు అన్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కిషోర్ వెంటనే స్పందించాడు. రామోజీ ఫిలిం సిటీలో నైట్ షూట్లో ఉన్నానని.. కాబట్టే రాలేకపోయానని.. లవ్ యు శర్వా అని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా.. ఒకే ఒక జీవితం సినిమా తనకు చాలా స్పెషల్ అని.. ఆ సినిమాను ఎంతగానో నమ్మి చేశామని.. కచ్చితంగా ఓ మంచి సినిమాను అందిస్తున్నామని ప్రేక్షకులకు ప్రామిస్ చేస్తున్నానని.. డిజప్పాయింట్ చేయనని శర్వా ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on September 8, 2022 6:22 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…