సినీ రంగంలో చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ కొద్దిమంది మాత్రమే తమ స్నేహ బంధం ఎంత గాఢమైందో బహిరంగ వేదిక మీద చాటుతుంటారు. మోహన్ బాబు రజినీకాంత్ ప్రస్తావన వస్తే ఎప్పుడూ కూడా ఒరేయ్, వాడు అనే సంబోధిస్తుంటాడు. కానీ రజినీ మాత్రం ఇలా మాట్లాడడు.
ఇక టాలీవుడ్ యువ కథానాయకుల్లో చాలామంది ఒకరినొకరు రేయ్ అని పిలుచుకుంటుంటారు కానీ.. వేదికల మీద చాలా వరకు ఒకరినొకరు మర్యాదగానే సంబోధిస్తారు. ఐతే యంగ్ హీరో శర్వానంద్ మాత్రం.. తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వెన్నెల కిషోర్ను తన కొత్త చిత్రం ఒకే ఒక జీవితం ప్రెస్ మీట్ సందర్భంగా సంబోధించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్రంలో కిషోర్ కూడా ముఖ్య పాత్ర పోషించగా.. వేరే షూటింగ్ ఉండడం వల్ల ఈ ఈవెంట్కు రాలేకపోయాడు.
ఐతే కారణమేదైనప్పటికీ కిషోర్ ఈ కార్యక్రమానికి రాకపోవడంతో శర్వాకు కోపం వచ్చింది. కానీ అది ప్రేమతో కూడిన కోపమే. అతను రాకపోవడంపై స్పందిస్తూ.. ఆ నా కొడుకు అయిపోయాడు. ఒరే వెన్నెల కిషోర్గా నీ సంగతి చూస్కుంటా. వాడికి ఈ సినిమా ఇప్పించింది కూడా నేనే. కానీ వాడు ఈ ఈవెంట్కు రాలేదు అన్నాడు. కాకపోతే మాటల్లో ఉన్నంత తీవ్రత ముఖంలో కనిపించలేదు. శర్వా నవ్వుతూనే ఈ మాటలు అన్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కిషోర్ వెంటనే స్పందించాడు. రామోజీ ఫిలిం సిటీలో నైట్ షూట్లో ఉన్నానని.. కాబట్టే రాలేకపోయానని.. లవ్ యు శర్వా అని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా.. ఒకే ఒక జీవితం సినిమా తనకు చాలా స్పెషల్ అని.. ఆ సినిమాను ఎంతగానో నమ్మి చేశామని.. కచ్చితంగా ఓ మంచి సినిమాను అందిస్తున్నామని ప్రేక్షకులకు ప్రామిస్ చేస్తున్నానని.. డిజప్పాయింట్ చేయనని శర్వా ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on September 8, 2022 6:22 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…