కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా ‘ఓటీటీ రిలీజ్’ అనే పదం సోషల్ మీడియాలో తరుచుగా వినబడుతోంది. థియేటర్లు మూతబడడం, లాక్డౌన్ ఎత్తేసినా సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే క్లారిటీ లేకపోవడంతో ఓటీటీ రిలీజ్ గురించి పెద్ద డిస్కర్షన్ జరుగుతోంది. అయితే ఓటీటీ రిలీజ్ మాట చెబితే చాలు ఉలిక్కిపడుతున్నారు టాలీవుడ్ జనాలు. రాజ్ తరుణ్, రామ్, అనుష్క… ఇలా ఓటీటీ రిలీజ్ను ఖండిస్తున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.
నాని ‘వీ’, అనుష్క ‘నిశ్శబ్దం’, రామ్ ‘రెడ్’, రాజ్ తరుణ్ ‘ఓరేయ్ బుజ్జిగా’, రానా ‘అరణ్య’… ఇలా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని రిలీజ్ వాయిదా పడిన తెలుగు సినిమాల సంఖ్య పెద్దగానే ఉంది. లాక్డౌన్ కారణంగా వీటి రిలీజ్పై సందిగ్ధత నెలకొంది. దాంతో వీటిలో కొన్ని సినిమాలను నేరుగా ఓటీటీ ఫ్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది.
‘రెడ్’ సినిమాపై ఇలాంటి వార్తలు వస్తే, హీరో రామ్ నేరుగా ట్విట్టర్ ద్వారా స్పందించి, ‘ఎంత లేట్ అయినా థియేటర్లలోనే రిలీజ్ చేస్తాం’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ‘ఓరేయ్ బుజ్జిగా’ సినిమా కూడా ఓటీటీ రిలీజ్ కాదంటూ స్పష్టం చేశాడు రాజ్ తరుణ్. ఇప్పుడు ‘నిశ్శబ్దం’ సినిమా నేరుగా ఓటీటీ రిలీజ్ కానుందంటూ వస్తున్న వార్తలపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.
‘షూటింగ్ మొదలెట్టినప్పటి నుంచి అనుష్క శెట్టితో పాటు చిత్ర యూనిట్ మొత్తం ‘నిశ్శబ్దం’ కోసం చాలా కష్టపడిందని… ఇలాంటి అర్థం లేని రూమర్లను నమ్మవద్దంటూ’ కొట్టిపాడేశారు నిర్మాతలు. అయితే ఓటీటీ రిలీజ్ అంటే అంత పెద్ద తప్పేం కాదు అంటున్నారు విశ్లేషకులు. థియేటర్లలో రిలీజ్ అయితే ఆ సినిమా రిజల్ట్ ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు.
ఓటీటీ ఫ్లాట్ఫామ్లో అయితే రిలీజ్కి ముందే డబ్బులు వస్తాయి. అదీగాక పరిస్థితులు ఎప్పుడు నార్మల్ అవుతాయో తెలియకుండా రిలీజ్ కోసం వెయిట్ చేయడం కంటే ఓటీటీ రిలీజ్ చేయడమే బెటర్ అనేది చాలామంది ఫీలింగ్. కాని మన సినిమా బాబులు మాత్రం, ధియటర్లో రిలీజ్ చేస్తేనే మాస్ లో క్రేజ్ వస్తుంది కాబట్టి, అదే కావాలని అంటున్నారు. అది సంగతి.
This post was last modified on April 22, 2020 1:46 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…