బాహుబలి మూవీతో ప్రభాస్ తిరుగులేని ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించాడన్న ఆనందం బాగానే ఉంది కానీ.. వాటిని నిలబెట్టుకునే సినిమాలు తర్వాత అతడి నుంచి రాకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఇదొక బాధ అయితే ప్రభాస్ చేస్తున్న సినిమాలకు సరైన ప్రమోషన్లు లేకపోవడం, సమయానుకూలంగా అప్ డేట్స్ ఇవ్వకపోవడం వారిని మరింత బాధిస్తున్న విషయం. సాహో, రాధేశ్యామ్ రెండు చిత్రాల విషయంలోనూ ఇలాగే జరిగి యువి క్రియేషన్స్ వాళ్ల మీద ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
బాలీవుడ్ వాళ్లు ప్రమోషన్లలో బాగా ముందుంటారు కాబట్టి ఆదిపురుష్ విషయంలోనైనా హడావుడి కనిపిస్తుందేమో అనుకుంటే.. అక్కడ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సినిమా మొదలై, షూటింగ్ పూర్తయి చాలా కాలం అయినా ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేయలేదు.
ఈ విషయంలో ఇప్పటికే తీవ్ర నిరాశకు గురైన ప్రభాస్ ఫ్యాన్స్ అక్టోబరు 23న తమ కథానాయకుడి పుట్టిన రోజుకైనా ఫస్ట్ లుక్ వస్తుందేమో అన్న ఆశతో ఉన్నారు. ఇదే విషయాన్ని ముంబయిలో మీడియా కంట పడ్డ దర్శక నిర్మాత ఓం రౌత్ను అడగ్గా.. అతను తీపి కబురు చెప్పాడు. ప్రభాస్ పుట్టిన రోజుకు కచ్చితంగా ట్రీట్ ఉంటుందని.. అది జస్ట్ ఫస్ట్ లుక్ కాదని అతను సంకేతాలు ఇచ్చాడు. చాలా పెద్ద ట్రీటే ఉంటుందని.. అభిమానులు చాలా సంతోషించేలా అది ఉంటుందని అతను చెప్పాడు.
ఈ వీడియో చూసి ప్రభాస్ అభిమానులు అమితానందానికి గురవుతున్నారు. బహుశా ప్రభాస్ బర్త్ డేకి ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జనవరి 11న సినిమా రిలీజ్ కావాల్సి ఉన్న నేపథ్యంలో టీజర్ లాంచ్కు ఇది సరైన టైమింగే అని భావిస్తున్నారు.
This post was last modified on September 8, 2022 9:30 am
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…