బాహుబలి మూవీతో ప్రభాస్ తిరుగులేని ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించాడన్న ఆనందం బాగానే ఉంది కానీ.. వాటిని నిలబెట్టుకునే సినిమాలు తర్వాత అతడి నుంచి రాకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఇదొక బాధ అయితే ప్రభాస్ చేస్తున్న సినిమాలకు సరైన ప్రమోషన్లు లేకపోవడం, సమయానుకూలంగా అప్ డేట్స్ ఇవ్వకపోవడం వారిని మరింత బాధిస్తున్న విషయం. సాహో, రాధేశ్యామ్ రెండు చిత్రాల విషయంలోనూ ఇలాగే జరిగి యువి క్రియేషన్స్ వాళ్ల మీద ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
బాలీవుడ్ వాళ్లు ప్రమోషన్లలో బాగా ముందుంటారు కాబట్టి ఆదిపురుష్ విషయంలోనైనా హడావుడి కనిపిస్తుందేమో అనుకుంటే.. అక్కడ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సినిమా మొదలై, షూటింగ్ పూర్తయి చాలా కాలం అయినా ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేయలేదు.
ఈ విషయంలో ఇప్పటికే తీవ్ర నిరాశకు గురైన ప్రభాస్ ఫ్యాన్స్ అక్టోబరు 23న తమ కథానాయకుడి పుట్టిన రోజుకైనా ఫస్ట్ లుక్ వస్తుందేమో అన్న ఆశతో ఉన్నారు. ఇదే విషయాన్ని ముంబయిలో మీడియా కంట పడ్డ దర్శక నిర్మాత ఓం రౌత్ను అడగ్గా.. అతను తీపి కబురు చెప్పాడు. ప్రభాస్ పుట్టిన రోజుకు కచ్చితంగా ట్రీట్ ఉంటుందని.. అది జస్ట్ ఫస్ట్ లుక్ కాదని అతను సంకేతాలు ఇచ్చాడు. చాలా పెద్ద ట్రీటే ఉంటుందని.. అభిమానులు చాలా సంతోషించేలా అది ఉంటుందని అతను చెప్పాడు.
ఈ వీడియో చూసి ప్రభాస్ అభిమానులు అమితానందానికి గురవుతున్నారు. బహుశా ప్రభాస్ బర్త్ డేకి ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జనవరి 11న సినిమా రిలీజ్ కావాల్సి ఉన్న నేపథ్యంలో టీజర్ లాంచ్కు ఇది సరైన టైమింగే అని భావిస్తున్నారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…