ఎదురుచూసే కొద్దీ ఆలస్యమవుతూనే ఉన్న మహేష్ బాబు కొత్త సినిమా షూటింగ్ ఎట్టకేలకు మొదలు కాబోతోంది. ఈ నెల 12న అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్లో హీరోతో పాటు ఇతర కీలక తారాగణం పాల్గొనగా మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఫైట్ ఎపిసోడ్ తో త్రివిక్రమ్ కెమెరాకు పని చెప్పబోతున్నారు. సందేశాలు వగైరాలు ఏమీ లేకుండా యాక్షన్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ తో పక్కా పైసా వసూల్ మూవీగా మాటల మాంత్రికుడు దీన్ని తీర్చిదిద్దుతారని ఇన్ సైడ్ టాక్. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో ఆయన మీదే అంచనాల బరువుంది.
దీనికోసమే ప్రత్యేకంగా హెయిర్ స్టైల్ తో పాటు మీసం పెంచిన మహేష్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇటీవలే నటించిన యాడ్స్, ఓ టీవీ ప్రోగ్రాంకు గెస్ట్ గా వెళ్ళినప్పుడు ఆ లుక్ కు సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చేసింది. మహర్షి తర్వాత అంతకు మించిన కూల్ అండ్ యూత్ ఫుల్ అవతారంలో సూపర్ స్టార్ రచ్చ మాములుగా ఉండేలా కనిపించడం లేదు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో కథానాయకి ఉంటుందన్నారు కానీ అదెవరో మాత్రం లీక్ కాలేదు. అయిదారు పేర్లు వినిపించాయి కానీ అసలు సీక్రెట్ గుట్టుగానే ఉంది.
శ్రీలీల దగ్గర లాక్ అయ్యారని ప్రచారం జరిగినా అదీ నిర్ధారణ కాలేదు. మహేష్ కి ఇది బ్లాక్ బస్టర్ కావడం చాలా అవసరం. మంచి మాస్ సెటప్ చేసిన సర్కారు వారి పాట హంగామా అయితే చేసింది కానీ ఆశించిన స్థాయిలో వసూళ్ల రికార్డులు రాలేదు. సరిలేరు నీకెవ్వరు హిట్ అయినా ఒక్కడు, పోకిరి రేంజ్ ని అభిమానులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. గతంలో అతడు, ఖలేజాలు త్రివిక్రమ్ మహేష్ లు కోరుకున్న రేంజ్ లో మేజిక్ చేయలేకపోయాయి. ఆ లోటుని ఇది పూర్తిగా తీర్చాలనే పట్టుతో ఉన్నారు. తమన్ నుంచి కూడా కిక్ యాస్ ఆల్బమ్ బాకీ ఉంది. చూద్దాం
This post was last modified on September 8, 2022 9:24 am
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…