నందమూరి మూడో తరం వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలకృష్ణ అభిమానులు ఎదురుచూసే కొద్దీ ఆలస్యమవుతూనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ సెటిలైనప్పటికీ బాలయ్య కొడుకుని తెరమీద చూసుకోవాలన్న ఫ్యాన్స్ ఆత్రం ఇప్పట్లో తీరే సూచనలు కనిపించడం లేదు. తన పుట్టినరోజు సందర్భంగా బయటికొచ్చిన ఫొటోల్లో బాడీ ఫిట్ నెస్ కోసం మోక్షజ్ఞ పెద్దగా కష్టపడుతున్నట్టు అనిపించలేదు. నిజంగా తనకు ఆసక్తి లేదా లేక మరికొన్నేళ్లు ఆగిచూద్దామని తండ్రే పెండింగ్ లో పెడుతూ వస్తున్నారో అర్థం కావడం లేదు. నేరుగా అడిగే సాహసం మాత్రం ఎవరూ చేయలేకపోతున్నారు.
నిజానికి మోక్షజ్ఞని టాలీవుడ్ కు పరిచయం చేయాలని కొన్నేళ్ల క్రితమే గట్టి ప్రయత్నాలు జరిగాయి. సాయి కొర్రపాటి నిర్మాణంలో రానే వచ్చాడు మా రామయ్య టైటిల్ తో తెరంగేట్రాన్ని ప్లాన్ చేసుకున్నారు. అదే సమయంలో తారక్ రామయ్య వస్తావయ్యా డిజాస్టర్ కావడంతో పేరు మారుద్దామనే ఆలోచన కూడా జరిగింది. కట్ చేస్తే ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. మోక్షజ్ఞకు ఇంట్రస్ట్ లేదని, ఎవరి ఒత్తిడి కోసమో సినిమాల్లో నటించే ఉద్దేశం పెట్టుకోలేదని కొంత ప్రచారం జరిగింది కానీ నిజానిజాలేంటో ఆ కుటుంబానికే తెలియాలి.
కొన్ని నెలల క్రితం దర్శకుడు పూరి జగన్నాధ్ పేరు వినిపించింది. రామ్ చరణ్ ని చిరుతతో పర్ఫెక్ట్ గా లాంచ్ చేశాడు కాబట్టి మోక్షజ్ఞను కూడా తన చేతుల్లో పెట్టాలనే ప్రతిపాదన వచ్చిందట. పైసా వసూల్ తర్వాత పూరితో మరొకటి చేయాలన్న బాలయ్య కమిట్ మెంట్ ఈ రకంగా పూర్తి చేయొచ్చనే ఆలోచన కాబోలు. కానీ ఇప్పుడు లైగర్ ఫలితం చూశాక అలాంటి సాహసం చేస్తారని చెప్పలేం. ఏది ఏమైనా మోక్షజ్ఞను ఇండస్ట్రీకి తీసుకురావాలంటే వీలైనంత త్వరగా ఎంట్రీ చేయించడం మంచిది. ఎందుకంటే ఈ జెనరేషన్ మిస్ అయితే ఈ ఫ్యామిలీకి నాలుగో తరం మొదలవుతుంది
This post was last modified on September 7, 2022 6:59 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…