అసలు పెద్దగా అంచనాలు లేకుండా తెలుగులో రిలీజ్ కావడానికే కొంత ఇబ్బంది పడ్డ కార్తికేయ 2 జోరు నాలుగో వారంలోనూ యమా స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ దీన్ని సొంతం చేసుకోగా మరోసారి సౌత్ సినిమా సత్తాను చాటినట్టు అయ్యింది. శ్రీకృష్ణ తత్వాన్ని ఒక ట్రెజర్ హంట్ మోడల్ లో దర్శకుడు చందూ మొండేటి చూపించిన తీరుకి ముంబై లాంటి నగరాల్లో వసూళ్ల వర్షం కురుస్తోంది.
గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆగ్రా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో నిఖిల్ బొమ్మ తాకిడి మాములుగా లేదు. సోషల్ మీడియా మద్దతు విపరీతంగా పెరిగిపోవడం మరో సానుకూలాంశం. మరో అరుదైన ఘనత కార్తికేయ 2 సొంతమయ్యింది. హిందీ డబ్బింగ్ వెర్షన్లలో టాప్ 10 కలెక్షన్లలో చోటు దక్కించుకుంది. అది కూడా ఇంకా ఫైనల్ రన్ దాటకుండానే. పదో స్థానంలో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి(28 కోట్లు)ని దాటేసి గర్వంగా తొమ్మిదో ప్లేస్ ని అందుకుంది.
తాజాగా నిఖిల్ సినిమా 29 కోట్ల మార్క్ అందుకుంది. అంతేసి ప్రశంసలు దక్కించుకున్న మాధవన్ రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ కేవలం 26 కోట్లతో పదకొండో స్థానానికి పరిమితం కాగా ప్రభాస్ రాధే శ్యామ్ 13వ ర్యాంక్ లో 19 కోట్ల 30 లక్షల దగ్గర ఆగిపోయింది. కార్తికేయ 2కి ఇది ఊహించని రికార్డు. ఇప్పుడు దీని ముందున్న నెక్స్ట్ టార్గెట్ కెజిఎఫ్ చాప్టర్ 2. అయితే అదంతా సులభం కాదు. ఎందుకంటే రాఖీ భాయ్ 44 కోట్లతో ఎనిమిదో ప్లేస్ లో తిష్టవేసుకుని కూర్చుకున్నాడు. ఇది క్రాస్ చేసినా చాలు.
అయితే బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ వచ్చాక ఆ ఎఫెక్ట్ బలంగా ఉంటుంది కాబట్టి సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ దాని టాక్ అటుఇటు అయినా మళ్ళీ పుంజుకోవచ్చు. ఇప్పుడీ ఎఫెక్ట్ కార్తికేయ 1 మీద పడి అది ఏ ఓటిటిలో దొరుకుతోందో వెతికి మరీ చూసేస్తున్నారు బాలీవుడ్ జనాలు. మొత్తానికి నిఖిల్ తీసుకున్న గ్యాప్ కి, పడిన కష్టానికి, అనుభవించిన ఆవేదనకు మంచి ఫలితాన్ని దక్కించుకున్నాడు.
This post was last modified on September 6, 2022 9:25 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…