పూరి జగన్నాథ్ పరిస్థితి ఉన్నట్లుండి మళ్లీ తలకిందులైంది. ‘టెంపర్’ తర్వాత చాలా ఏళ్లు సక్సస్ లేక ఆయన చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి టైంలో ‘ఇస్మార్ట్ శంకర్’ ఆయన కెరీర్కు మళ్లీ ఊపిరులూదింది. ఆ దశలో ఆయనకు అది అత్యావశ్యకం విజయం అనే చెప్పాలి. దీంతో ఆయన కెరీర్ మల్లీ గాడిన పడ్డట్లే కనిపించింది. విజయ్ లాంటి యూత్లో మంచి క్రేజున్న హీరో దొరకడం, కరణ్ జోహార్ లాంటి టాప్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ లభించడంతో ‘లైగర్’ను భారీ స్థాయిలో తీసే అవకాశం దక్కింది.
ఈ సినిమాకు బోలెడంత క్రేజ్ కూడా వచ్చింది. కానీ వీటిని పూరి ఉపయోగంచుకోలేకపోయాడు. చాలా సాధారణమైన సినిమా తీశాడు. పూరి ఇంతకుముందు డిజాస్టర్లు ఇచ్చినా.. వాటి గురించి మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరగలేదు. తక్కువ బడ్జెట్లో, తక్కువ రోజుల్లో సినిమా తీసేయడం.. నష్టాలు కూడా తక్కువే కావడం.. సినిమా పోగానే ఇంకో ప్రాజెక్ట్ సెట్ చేసుకుని ముందుకు వెళ్లిపోవడం వల్ల పూరి బండి నడిచిపోయింది. కానీ ‘లైగర్’ ఆయనకు చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు.
ఈ సినిమాతో పూరికి భారీ నష్టాలు తప్పట్లేదు. పేరు బాగా దెబ్బ తింది. ఆయన్ని నమ్మి పేరున్న హీరోలు, నిర్మాతలు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇలా అన్ని రకాలుగా పూరికి డ్యామేజ్ జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆయన తన కొడుకు పూరి ఆకాశ్ను హీరోగా పెట్టి ఒక కొరియన్ మూవీని రీమేక్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ దశలో ఆయనకు ఇంతకంటే ఆప్షన్ కూడా లేదనే చెప్పాలి.
‘లైగర్’ లాంటి సినిమా తీశాక పూరీతో సినిమా చేయడానికి కాస్త పేరున్న ఏ హీరో కూడా సాహసించడు. మరోవైపు తండ్రి చిత్రం ‘మెహబూబా’తో హీరోగా పరిచయం అయిన ఆకాశ్.. ఆ తర్వాత రొమాంటిక్, చోర్ బజార్ చిత్రాలతో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. అతడితో సినిమా తీయడానికి వేరే దర్శకులు, నిర్మాతలు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కొడుకుతో తండ్రి.. తండ్రితో కొడుకు జట్టు కట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఈ సినిమాతో తాను బౌన్స్ బ్యాక్ కావడమే కాక కొడుకుకు కూడా హిట్టిస్తే అంతకంటే పూరికి, ఆయన అభిమానులకు కావాల్సిందేముంది?
This post was last modified on September 5, 2022 5:27 pm
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…
టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఇప్పటికే సినిమాల్లో…