ఇంకో అయిదు రోజుల్లో విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ మీద అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ రాజమౌళి రేంజ్ లో లేవు కానీ ట్రెండ్ చూస్తుంటే సెప్టెంబర్ 9నాటికి మంచి ఫిగర్స్ నమోదయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ముంబై ట్రేడ్ ఇస్తున్న సమాచారం మేరకు ఇప్పటిదాకా 40 శాతం ఆక్యుపెన్సీతో 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయట. రిలీజ్ రోజు నేరుగా జరిగే కౌంటర్ బుకింగ్ లో ఎక్కువ అమ్మకాలు ఉంటాయని ఆశిస్తున్నారు. ట్రైలర్ కంటే బెటర్ గా మొన్న వచ్చిన కొత్త ప్రోమోతోనే హైప్ పెరిగిందని చెప్పాలి. జక్కన్న దీని ప్రమోషన్ల విషయంలో టీమ్ కు అండగా నిలుస్తున్నారు.
సుమారు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన బ్రహ్మాస్త్ర అంత రెవిన్యూ రాబడుతుందానేది ఆసక్తికరమైన చర్చను లేవనెత్తుతోంది. అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తే ఏ ఇబ్బంది లేదు. ఈజీగా వచ్చేస్తాయి. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2లు వెయ్యి కోట్లకు పైగా రాబట్టగా లేనిది అందులో సగం కూడా టార్గెట్ పెట్టుకోని బ్రహ్మాస్త్ర భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవు. అసలే నార్త్ ఆడియన్స్ ఈ మధ్య చాలా నిర్దయగా ఉంటున్నారు. స్టార్లు అయినా సరే కంటెంట్ వీక్ ఉంటే మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంత మొత్తం చిన్న విషయం కాదు. రన్బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ఇంత క్యాస్టింగ్ పెట్టుకుని కూడా టెన్షన్ పడక తప్పడం లేదు. తెలుగు మీద ఎంత ఫోకస్ పెట్టారంటే ఎన్నడూ లేనిది ఓ బాలీవుడ్ మూవీ టీమ్ బిగ్ బాస్ 6, యాంకర్ సుమ క్యాష్ లాంటి ప్రోగ్రాంస్ లో పాల్గొనేందుకు సైతం వెనుకాడలేదు. అలియా గర్భవతిగా ఉన్నా సరే రిస్క్ గురించి ఆలోచించకుండా విమానాల్లో తిరిగేస్తోంది. భర్తతో స్టేజి మీద తెలుగులో మాట్లాడించింది. లాల్ సింగ్ చడ్డా టైంలో అమీర్ ఖాన్ ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే గడపడం గుర్తేగా. కానీ ఆ ఫలితం రాకుంటే చాలు అదే పదివేలు.
This post was last modified on September 4, 2022 8:30 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…