ఇంకో అయిదు రోజుల్లో విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ మీద అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ రాజమౌళి రేంజ్ లో లేవు కానీ ట్రెండ్ చూస్తుంటే సెప్టెంబర్ 9నాటికి మంచి ఫిగర్స్ నమోదయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ముంబై ట్రేడ్ ఇస్తున్న సమాచారం మేరకు ఇప్పటిదాకా 40 శాతం ఆక్యుపెన్సీతో 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయట. రిలీజ్ రోజు నేరుగా జరిగే కౌంటర్ బుకింగ్ లో ఎక్కువ అమ్మకాలు ఉంటాయని ఆశిస్తున్నారు. ట్రైలర్ కంటే బెటర్ గా మొన్న వచ్చిన కొత్త ప్రోమోతోనే హైప్ పెరిగిందని చెప్పాలి. జక్కన్న దీని ప్రమోషన్ల విషయంలో టీమ్ కు అండగా నిలుస్తున్నారు.
సుమారు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన బ్రహ్మాస్త్ర అంత రెవిన్యూ రాబడుతుందానేది ఆసక్తికరమైన చర్చను లేవనెత్తుతోంది. అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తే ఏ ఇబ్బంది లేదు. ఈజీగా వచ్చేస్తాయి. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2లు వెయ్యి కోట్లకు పైగా రాబట్టగా లేనిది అందులో సగం కూడా టార్గెట్ పెట్టుకోని బ్రహ్మాస్త్ర భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవు. అసలే నార్త్ ఆడియన్స్ ఈ మధ్య చాలా నిర్దయగా ఉంటున్నారు. స్టార్లు అయినా సరే కంటెంట్ వీక్ ఉంటే మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంత మొత్తం చిన్న విషయం కాదు. రన్బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ఇంత క్యాస్టింగ్ పెట్టుకుని కూడా టెన్షన్ పడక తప్పడం లేదు. తెలుగు మీద ఎంత ఫోకస్ పెట్టారంటే ఎన్నడూ లేనిది ఓ బాలీవుడ్ మూవీ టీమ్ బిగ్ బాస్ 6, యాంకర్ సుమ క్యాష్ లాంటి ప్రోగ్రాంస్ లో పాల్గొనేందుకు సైతం వెనుకాడలేదు. అలియా గర్భవతిగా ఉన్నా సరే రిస్క్ గురించి ఆలోచించకుండా విమానాల్లో తిరిగేస్తోంది. భర్తతో స్టేజి మీద తెలుగులో మాట్లాడించింది. లాల్ సింగ్ చడ్డా టైంలో అమీర్ ఖాన్ ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే గడపడం గుర్తేగా. కానీ ఆ ఫలితం రాకుంటే చాలు అదే పదివేలు.
This post was last modified on September 4, 2022 8:30 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…