Sonakshi Sinha
సుశాంత్ రాజ్ సింగ్ ఆత్మహత్య వ్యవహారం తర్వాత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న వారసత్వ బృందంలో సోనాక్షి సిన్హా ఒకరు. పెద్దగా టాలెంట్ లేకపోయినా స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో వెలిగిపోతున్నారంటూ టార్గెట్ చేసిన వాళ్లలో సోనాక్షి కూడా ఉంది. ఈ ట్రోల్స్ అవీ తట్టుకోలేక ఆమె ట్విట్టర్ విడిచి వెళ్లిపోయింది కొన్ని రోజుల కిందట. ఐతే కొంచెం గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ వార్తల్లోకి వచ్చింది. మళ్లీ ఆదివారం ఆమె పేరు ట్విట్టర్లో టాప్లో ట్రెండ్ అయింది. ఇందుక్కారణం.. ఇండస్ట్రీలో తాను అవమానాలు ఎదుర్కొన్నట్లు చెప్పడమే.
సోనాక్షి ఒకప్పుడు ఏకంగా 95 కిలోలుండేది. అప్పటి ఫొటోలు కూడా కొన్ని అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఐతే హీరోయిన్ కావడం కోసం తాను 30 కిలోల దాకా బరువు తగ్గానని.. అప్పటికి కానీ దబంగ్ సినిమాలో కనిపించిన అవతారంలోకి మారలేదని చెప్పిన సోనాక్షి.. అంత కష్టపడ్డా కూడా ఇండస్ట్రీలో అవమానాలు తప్పలేదని అంది.
‘‘స్కూల్లో చదివేటపుడు నేను 95 కిలోలు ఉండేదాన్ని. అప్పుడందరూ నా బరువు చూసి ఎగతాళి చేసేవాళ్లు. కానీ అవేవీ నేను పట్టించుకోలేదు. నన్ను నేను తక్కువ చేసుకోలేదు. దబంగ్ సినిమా కోసం బరువు తగ్గడం నేను సాధించిన ఓ ఘనతగా భావిస్తా. ఆ విషయంలో గర్వపడతా. కానీ 30 కిలోల బరువు తగ్గాక కూడా జనాలు నా వెయిట్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. బరువు విషయంలో అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నాను’’అని సోనాక్షి చెప్పుకొచ్చింది.
ఐతే పెద్దగా కష్టం లేకుండా సినిమాల్లోకి వచ్చేసిన నీలాంటి స్టార్ కిడ్సే ఇలా మాట్లాడితే.. సుశాంత్ లాంటి వాళ్లు ఎంత శ్రమించి ఉంటారంటూ మరోసారి సోనాక్షిని టార్గెట్ చేశారు నెటిజన్లు. అందుకే ఆమె పేరు మరోసారి ట్రెండ్ అవుతోంది.
This post was last modified on July 6, 2020 4:50 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…