Sonakshi Sinha
సుశాంత్ రాజ్ సింగ్ ఆత్మహత్య వ్యవహారం తర్వాత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న వారసత్వ బృందంలో సోనాక్షి సిన్హా ఒకరు. పెద్దగా టాలెంట్ లేకపోయినా స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో వెలిగిపోతున్నారంటూ టార్గెట్ చేసిన వాళ్లలో సోనాక్షి కూడా ఉంది. ఈ ట్రోల్స్ అవీ తట్టుకోలేక ఆమె ట్విట్టర్ విడిచి వెళ్లిపోయింది కొన్ని రోజుల కిందట. ఐతే కొంచెం గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ వార్తల్లోకి వచ్చింది. మళ్లీ ఆదివారం ఆమె పేరు ట్విట్టర్లో టాప్లో ట్రెండ్ అయింది. ఇందుక్కారణం.. ఇండస్ట్రీలో తాను అవమానాలు ఎదుర్కొన్నట్లు చెప్పడమే.
సోనాక్షి ఒకప్పుడు ఏకంగా 95 కిలోలుండేది. అప్పటి ఫొటోలు కూడా కొన్ని అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఐతే హీరోయిన్ కావడం కోసం తాను 30 కిలోల దాకా బరువు తగ్గానని.. అప్పటికి కానీ దబంగ్ సినిమాలో కనిపించిన అవతారంలోకి మారలేదని చెప్పిన సోనాక్షి.. అంత కష్టపడ్డా కూడా ఇండస్ట్రీలో అవమానాలు తప్పలేదని అంది.
‘‘స్కూల్లో చదివేటపుడు నేను 95 కిలోలు ఉండేదాన్ని. అప్పుడందరూ నా బరువు చూసి ఎగతాళి చేసేవాళ్లు. కానీ అవేవీ నేను పట్టించుకోలేదు. నన్ను నేను తక్కువ చేసుకోలేదు. దబంగ్ సినిమా కోసం బరువు తగ్గడం నేను సాధించిన ఓ ఘనతగా భావిస్తా. ఆ విషయంలో గర్వపడతా. కానీ 30 కిలోల బరువు తగ్గాక కూడా జనాలు నా వెయిట్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. బరువు విషయంలో అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నాను’’అని సోనాక్షి చెప్పుకొచ్చింది.
ఐతే పెద్దగా కష్టం లేకుండా సినిమాల్లోకి వచ్చేసిన నీలాంటి స్టార్ కిడ్సే ఇలా మాట్లాడితే.. సుశాంత్ లాంటి వాళ్లు ఎంత శ్రమించి ఉంటారంటూ మరోసారి సోనాక్షిని టార్గెట్ చేశారు నెటిజన్లు. అందుకే ఆమె పేరు మరోసారి ట్రెండ్ అవుతోంది.
This post was last modified on July 6, 2020 4:50 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…