Sonakshi Sinha
సుశాంత్ రాజ్ సింగ్ ఆత్మహత్య వ్యవహారం తర్వాత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న వారసత్వ బృందంలో సోనాక్షి సిన్హా ఒకరు. పెద్దగా టాలెంట్ లేకపోయినా స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో వెలిగిపోతున్నారంటూ టార్గెట్ చేసిన వాళ్లలో సోనాక్షి కూడా ఉంది. ఈ ట్రోల్స్ అవీ తట్టుకోలేక ఆమె ట్విట్టర్ విడిచి వెళ్లిపోయింది కొన్ని రోజుల కిందట. ఐతే కొంచెం గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ వార్తల్లోకి వచ్చింది. మళ్లీ ఆదివారం ఆమె పేరు ట్విట్టర్లో టాప్లో ట్రెండ్ అయింది. ఇందుక్కారణం.. ఇండస్ట్రీలో తాను అవమానాలు ఎదుర్కొన్నట్లు చెప్పడమే.
సోనాక్షి ఒకప్పుడు ఏకంగా 95 కిలోలుండేది. అప్పటి ఫొటోలు కూడా కొన్ని అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఐతే హీరోయిన్ కావడం కోసం తాను 30 కిలోల దాకా బరువు తగ్గానని.. అప్పటికి కానీ దబంగ్ సినిమాలో కనిపించిన అవతారంలోకి మారలేదని చెప్పిన సోనాక్షి.. అంత కష్టపడ్డా కూడా ఇండస్ట్రీలో అవమానాలు తప్పలేదని అంది.
‘‘స్కూల్లో చదివేటపుడు నేను 95 కిలోలు ఉండేదాన్ని. అప్పుడందరూ నా బరువు చూసి ఎగతాళి చేసేవాళ్లు. కానీ అవేవీ నేను పట్టించుకోలేదు. నన్ను నేను తక్కువ చేసుకోలేదు. దబంగ్ సినిమా కోసం బరువు తగ్గడం నేను సాధించిన ఓ ఘనతగా భావిస్తా. ఆ విషయంలో గర్వపడతా. కానీ 30 కిలోల బరువు తగ్గాక కూడా జనాలు నా వెయిట్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. బరువు విషయంలో అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నాను’’అని సోనాక్షి చెప్పుకొచ్చింది.
ఐతే పెద్దగా కష్టం లేకుండా సినిమాల్లోకి వచ్చేసిన నీలాంటి స్టార్ కిడ్సే ఇలా మాట్లాడితే.. సుశాంత్ లాంటి వాళ్లు ఎంత శ్రమించి ఉంటారంటూ మరోసారి సోనాక్షిని టార్గెట్ చేశారు నెటిజన్లు. అందుకే ఆమె పేరు మరోసారి ట్రెండ్ అవుతోంది.
This post was last modified on July 6, 2020 4:50 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…