ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇండస్ట్రీలో కొంత వరకే పనికొస్తుంది. ఆపై నెగ్గుకురావాలంటే టాలెంట్ తో పాటు సక్సెస్ ఉంటేనే మనుగడ సాధ్యం. ఇది అందరికి తెలిసిన సత్యమే. అందుకే ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా, కథల ఎంపికలో నిర్లక్ష్యం వహించినా దానికి సదరు హీరోలే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అభిమానుల సానుభూతి కూడా దక్కదు. ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ కు ఇది మెల్లగా అవగతమవుతోంది.
ఒకే సినిమాతో ఉప్పెన తెచ్చిన ఇమేజ్ ఎక్కువ కాలం తనను గార్డ్ చేయలేదని ఒక్కో ఫ్లాపు తగిలేకొద్దీ కుర్రాడికి క్లారిటీ వస్తోంది. రంగ రంగ వైభవంగా చాలా వీక్ ఓపెనింగ్ తెచ్చుకుంది. అతి కష్టం మీద మొదటి రోజు షేర్ కేవలం 1 కోటి 5 లక్షలు రావడమంటే ఈ సినిమా మీద ప్రేక్షకులకు కనీస ఆసక్తి లేదనే విషయం తేటతెల్లం చేస్తోంది. ఆదివారం వసూళ్లు దీనికంటే కార్తికేయ 2, సీతారామంలకే బాగున్నాయి.
ఎలాగూ పబ్లిక్ టాక్ రివ్యూలు నెగటివ్ గా వచ్చేశాయి కాబట్టి ఇక ఏదో అద్భుతం జరిగితే తప్ప బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టం. థియేట్రికల్ బిజినెస్ సుమారు ఎనిమిదిన్నర కోట్ల దాకా చేశారు. హిట్ అయితే ఇది చాలా చిన్న మొత్తం. కానీ ఫలితం రివర్స్ అయ్యింది. హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. బిసి సెంటర్స్ లో డ్రాప్ తీవ్రంగా ఉంది. వైష్ణవ్ ఇకపై మరింత జాగరూకతతో ఉండాలి. అసలే నటన మీద కామెంట్స్ ఎక్కువవుతున్నాయి.
ఒకప్పుడు తరుణ్, వరుణ్ సందేశ్, ఉదయ్ కిరణ్ లాంటోళ్ళు కెరీర్ ప్రారంభంలో బ్లాక్ బస్టర్లు ఇండస్ట్రీ హిట్లు చూశారు. కానీ తర్వాత వరస పరాజయాలు ఏకంగా ఇండస్ట్రీకి దూరం చేశాయి. అక్కినేని హీరోల మద్దతు ఉన్నా సుమంత్ ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు. నందమూరి ఫ్యామిలీలో తారకరత్న ఏమయ్యాడో చూశాం. సో వైష్ణవ్ తేజ్ ఇప్పుడీ రెండో వైఫల్యం గురించి సీరియస్ విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పెదమావయ్య చిరంజీవి పేరుని తెరమీద వాడకుండా స్క్రిప్ట్ ల విషయంలో ఆయన సలహాలు నిర్ణయాలు తీసుకోవడంలో వాడుకుంటే బెటర్.
This post was last modified on September 4, 2022 6:28 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…