కేతిక శర్మ.. గత ఏడాది టాలీవుడ్లోకి కొత్తగా అడుగు పెట్టిన ముంబయి భామ. తొలి సినిమా ‘రొమాంటిక్’తో యూత్కు ఈ అమ్మాయి పిచ్చెక్కించేసిందనే చెప్పాలి. ఈ సినిమాకు యూత్లో బజ్ క్రియేట్ అయిందంటే అందుకు కేతికనే కారణం. తొలి రోజు ఓపెనింగ్స్ రావడంలో కూడా ఈ అమ్మాయి కీలక పాత్ర పోషించింది. ప్రోమోల్లో ఆ రేంజిలో అందచందాలతో ఆకట్టుకుంది కేతిక. సినిమా ఎంత పేలవంగా ఉన్నప్పటికీ.. హీరోయిన్ గురించి మాత్రం అందరూ పాజిటివ్గానే మాట్లాడుకున్నారు.
సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇది చూసే తొలి సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కేతికకు అవకాశాలు వచ్చాయి. ఆమె రెండో సినిమా.. లక్ష్య. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులకు ఏమాత్రం రుచించలేదు. పేలవమైన కథాకథనాలు సినిమాను నీరుగార్చేశాయి. అందులో కేతిక కూడా పెద్దగా హైలైట్ కాలేదు.
అయినా ‘రంగ రంగ వైభవంగా’ లాంటి క్రేజున్న సినిమాలో కేతికకు అవకాశం దక్కింది. ఇందులో ‘ఉప్పెన’ హీరో వైష్ణవ్ తేజ్ హీరో కావడం, పాటలు సూపర్ హిట్టవడం, ప్రోమోల్లో రొమాన్స్.. ఎంటర్టైనర్మెంట్ హైలైట్ కావడంతో సినిమాకు డీసెంట్ బజ్ వచ్చింది. ఇలాంటి ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ ఎంటర్టైనర్లలో హీరోయిన్లకు మంచి స్కోప్ ఉంటుంది. సినిమా బాగుంటే మంచి పేరొస్తుంది. కెరీర్ కూడా మరో స్థాయికి వెళ్తుంది. దీంతో ఈ చిత్రంపై కేతిక చాలా ఆశలే పెట్టుకుంది. కానీ శుక్రవారం రిలీజైన ‘రంగ రంగ వైభవంగా’ తుస్సుమనిపించింది.
దశాబ్దాల నుంచి చూస్తున్న రొటీన్ టెంప్లేట్లో సాగిన సినిమా పూర్తి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. తొలి రోజు మ్యాట్నీల నుంచే థియేటర్లు వెలవెలబోయాయి. వీకెండ్లో కూడా సినిమా నిలబడే ఛాన్సులు కనిపించలేదు. ఈ సినిమా మీద కేతిక పెట్టుకున్న ఆశలు అడియాసలే అయ్యేట్లున్నాయి. యూత్ను బాగా ఆకర్షించే అంద చందాలు ఉన్నా.. అదృష్టం కలిసి రాక కేతిక కెరీర్కు బ్రేకులు పడిపోయాయి. ఈ దశ నుంచి ఇక ఆమె ఏమాత్రం పుంజుకుంటుందో చూడాలి.
This post was last modified on September 3, 2022 6:05 pm
అసలు ఓజి ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ అప్పుడే ఓజి 2 గురించి ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల ముందు వరకు…
ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…