కేతిక శర్మ.. గత ఏడాది టాలీవుడ్లోకి కొత్తగా అడుగు పెట్టిన ముంబయి భామ. తొలి సినిమా ‘రొమాంటిక్’తో యూత్కు ఈ అమ్మాయి పిచ్చెక్కించేసిందనే చెప్పాలి. ఈ సినిమాకు యూత్లో బజ్ క్రియేట్ అయిందంటే అందుకు కేతికనే కారణం. తొలి రోజు ఓపెనింగ్స్ రావడంలో కూడా ఈ అమ్మాయి కీలక పాత్ర పోషించింది. ప్రోమోల్లో ఆ రేంజిలో అందచందాలతో ఆకట్టుకుంది కేతిక. సినిమా ఎంత పేలవంగా ఉన్నప్పటికీ.. హీరోయిన్ గురించి మాత్రం అందరూ పాజిటివ్గానే మాట్లాడుకున్నారు.
సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇది చూసే తొలి సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కేతికకు అవకాశాలు వచ్చాయి. ఆమె రెండో సినిమా.. లక్ష్య. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులకు ఏమాత్రం రుచించలేదు. పేలవమైన కథాకథనాలు సినిమాను నీరుగార్చేశాయి. అందులో కేతిక కూడా పెద్దగా హైలైట్ కాలేదు.
అయినా ‘రంగ రంగ వైభవంగా’ లాంటి క్రేజున్న సినిమాలో కేతికకు అవకాశం దక్కింది. ఇందులో ‘ఉప్పెన’ హీరో వైష్ణవ్ తేజ్ హీరో కావడం, పాటలు సూపర్ హిట్టవడం, ప్రోమోల్లో రొమాన్స్.. ఎంటర్టైనర్మెంట్ హైలైట్ కావడంతో సినిమాకు డీసెంట్ బజ్ వచ్చింది. ఇలాంటి ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ ఎంటర్టైనర్లలో హీరోయిన్లకు మంచి స్కోప్ ఉంటుంది. సినిమా బాగుంటే మంచి పేరొస్తుంది. కెరీర్ కూడా మరో స్థాయికి వెళ్తుంది. దీంతో ఈ చిత్రంపై కేతిక చాలా ఆశలే పెట్టుకుంది. కానీ శుక్రవారం రిలీజైన ‘రంగ రంగ వైభవంగా’ తుస్సుమనిపించింది.
దశాబ్దాల నుంచి చూస్తున్న రొటీన్ టెంప్లేట్లో సాగిన సినిమా పూర్తి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. తొలి రోజు మ్యాట్నీల నుంచే థియేటర్లు వెలవెలబోయాయి. వీకెండ్లో కూడా సినిమా నిలబడే ఛాన్సులు కనిపించలేదు. ఈ సినిమా మీద కేతిక పెట్టుకున్న ఆశలు అడియాసలే అయ్యేట్లున్నాయి. యూత్ను బాగా ఆకర్షించే అంద చందాలు ఉన్నా.. అదృష్టం కలిసి రాక కేతిక కెరీర్కు బ్రేకులు పడిపోయాయి. ఈ దశ నుంచి ఇక ఆమె ఏమాత్రం పుంజుకుంటుందో చూడాలి.
This post was last modified on September 3, 2022 6:05 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…