నిఖిల్ సిద్దార్థ్.. ఇతణ్ని స్టార్ అనలేం. అలా అని మరీ ఇమేజ్ లేని హీరో ఏమీ కాదు. యూత్లో కొంచెం ఫాలోయింగ్ ఉంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడనే పేరుంది. ‘హ్యపీడేస్’లో లీడ్ రోల్స్ చేసిన మిగతా కుర్రాళ్లంతా అడ్రస్ లేకుండా పోతే.. ఇతను మాత్రం కష్టపడి నిలదొక్కుకున్నాడు. ఒక దశలో నిఖిల్ కూడా తప్పటడుగులు వేసి ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయేలాగే కనిపించాడు. కానీ యువ దర్శకుడు సుధీర్ వర్మతో చేసిన ‘స్వామి రారా’ అతడి కెరీర్ను గొప్ప మలుపు తిప్పింది.
అక్కడ్నుంచి సినిమాల ఎంపికలో తన అభిరుచిని చాటుకుంటూ, భిన్నమైన దారిలో నడుస్తూ హీరోగా ఎదుగుతున్నాడు. ‘స్వామి రారా’ తర్వాత ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ పెద్ద హిట్లు పడ్డాయి అతడికి. కానీ తర్వాత మళ్లీ కొన్ని ఎదురు దెబ్బలు తప్పలేదు. చివరగా అతడి నుంచి వచ్చిన ‘అర్జున్ సురవరం’ ఓ మోస్తరుగా ఆడింది. కానీ కెరీర్ పుంజుకోవడానికి ఇంకా పెద్ద సక్సెస్ అవసరమైంది.
కానీ కొవిడ్ కారణంగా నిఖిల్ సినిమాలు అనిశ్చితిలో పడి.. మూడేళ్ల పాటు రిలీజ్ లేకుండా గడిపేశాడు నిఖిల్. చివరికి ‘కార్తికేయ-2’ను ఎన్నో ఇబ్బందులు దాటి రిలీజ్ చేయగలిగారు. ఈ చిత్రం అతడి నిరీక్షణకు, కష్టానికి సరైన ఫలితమే అందించింది. ఒక పెద్ద సినిమా స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర ఇరగాడేస్తూ 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుని ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ సినిమా ఎంత గొప్ప టాక్ వచ్చినా సరే.. మహా అయితే రూ.50 కోట్ల వసూళ్లు సాధిస్తే ఎక్కువ అనుకున్నారు. కానీ వంద కోట్ల తర్వాత కూడా స్ట్రాంగ్గా నిలబడింది. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తోంది. టాలీవుడ్లో ఇప్పటిదాకా 100 కోట్ల క్లబ్బులో చేరిన హీరోలు 11 మంది మాత్రమే. అందులో రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి.. వీళ్లు ఆ క్లబ్బులో చేరడం చాలా మామూలు విషయం.
వీళ్లు కాకుండా ‘గీత గోవిందం’తో విజయ్ దేవరకొండ ఆ క్లబ్బులోకి చేరి ఆశ్చర్యపరిచాడు. బాలకృష్ణ కూడా ‘అఖండ’తో చాలా లేటుగా ఈ ఫీట్ అందుకున్నాడు. వెంకటేష్, వరుణ్తేజ్లకు అదృష్టం కలిసొచ్చి ‘ఎఫ్-2’తో ఈ మార్కు చేరుకోగలిగారు. ఇలాంటి అరుదైన క్లబ్లో నిఖిల్ చేరతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ ‘కార్తికేయ-2’తో అతను ఈ మ్యాజిక్ మార్కును చేరుకోగలిగాడు.
This post was last modified on September 3, 2022 4:39 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…