పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్తో ‘వకీల్ సాబ్’ సినిమా తీస్తున్నాడు వేణు శ్రీరామ్. రెండేళ్లకు పైగా విరామం తర్వాత పవన్ రీఎంట్రీ ఇస్తున్న చిత్రమిదే కావడంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు ఏరి కోరి దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్.. వేణును దర్శకుడిగా ఎంపిక చేయడంతో అతడి పేరు చర్చనీయాంశంగా మారింది.
అతను ఇప్పటిదాకా తీసింది రెండే సినిమాలు. అందులో తొలి చిత్రం ‘ఓ మై ఫ్రెండ్’ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. రెండో సినిమా ‘ఎంసీఏ’ బాగానే ఆడింది. ఐతే ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ‘ఓ మై ఫ్రెండ్’తో దర్శకుడిగా తొలి అవకాశం అందుకుంటే ఆ చిత్రం తనకు ఏ రకంగానూ కలిసి రాలేదని అంటున్నాడు వేణు. ఆ చిత్రం రిలీజైన రోజు అమ్మానాన్నలు సహా కుటుంబ సభ్యులందరితో కలిసి సినిమా చూశానని.. కానీ ఆ ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైందని వేణు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
తనకు నిరాశ కలిగించింది ‘ఓ మై ఫ్రెండ్’ సినిమా ఫలితం కాదని.. అసలు ఆ సినిమా రిజల్ట్ ఏంటో కూడా తాను పట్టించుకోలేదని.. అందుక్కారణం ఆ చిత్రం విడుదలైన తర్వాతి రోజు తన తండ్రి చనిపోవడమే అని అతను వెల్లడించాడు. తమ స్వస్థలంలో నిర్మాణంలో ఉన్న ఇంటి పనులను పర్యవేక్షించడం కోసం హైదరాబాద్ నుంచి వెళ్లిన తన తండ్రి.. పై అంతస్థు నుంచి ప్రమాద వశాత్తూ కిందపడి చనిపోయారని.. అది తన జీవితంలో అతి పెద్ద విషాదం అని.. దాన్నుంచి కోలుకోవడానికి నెల పైనే పట్టిందని.. ఆ పరిస్థితుల్లో ‘ఓ మై ఫ్రెండ్’ ఫలితమేంటి.. ఆ సినిమా ఎలా ఆడుతోంది.. అన్నది కూడా తెలుసుకోలేదని.. చివరికి ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదని తెలిసిందని వేణు తెలిపాడు.
తన తండ్రి మరణంతోనే తన సంతోషాలన్నీ పోయాయని.. తన తొలి చిత్రం సరిగా ఆడలేదని.. ఆ తర్వాత ఓ స్టార్ హీరోతో (రవితేజ) సినిమా మొదలైనట్లే మొదలై ఆగిపోయిందని.. పవన్ కళ్యాణ్ సహా కొందరు స్టార్ల కోసం కథలు రాస్తే ఏవీ వర్కవుట్ కాలేదని.. చిన్న హీరోలను ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని.. దీంతో ఏడేళ్ల గ్యాప్ వచ్చిందని.. చివరికి నాని ‘ఎంసీఏ’ కథకు పచ్చ జెండా ఊపడంతో ఆ సినిమా చేసి హిట్టు కొట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని అతను వెల్లడించాడు.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…