Movie News

తొలి సినిమా రిలీజ్.. నాన్న చనిపోతే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్‌తో ‘వకీల్ సాబ్’ సినిమా తీస్తున్నాడు వేణు శ్రీరామ్. రెండేళ్లకు పైగా విరామం తర్వాత పవన్ రీఎంట్రీ ఇస్తున్న చిత్రమిదే కావడంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు ఏరి కోరి దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్.. వేణును దర్శకుడిగా ఎంపిక చేయడంతో అతడి పేరు చర్చనీయాంశంగా మారింది.

అతను ఇప్పటిదాకా తీసింది రెండే సినిమాలు. అందులో తొలి చిత్రం ‘ఓ మై ఫ్రెండ్’ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. రెండో సినిమా ‘ఎంసీఏ’ బాగానే ఆడింది. ఐతే ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ‘ఓ మై ఫ్రెండ్’తో దర్శకుడిగా తొలి అవకాశం అందుకుంటే ఆ చిత్రం తనకు ఏ రకంగానూ కలిసి రాలేదని అంటున్నాడు వేణు. ఆ చిత్రం రిలీజైన రోజు అమ్మానాన్నలు సహా కుటుంబ సభ్యులందరితో కలిసి సినిమా చూశానని.. కానీ ఆ ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైందని వేణు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

తనకు నిరాశ కలిగించింది ‘ఓ మై ఫ్రెండ్’ సినిమా ఫలితం కాదని.. అసలు ఆ సినిమా రిజల్ట్ ఏంటో కూడా తాను పట్టించుకోలేదని.. అందుక్కారణం ఆ చిత్రం విడుదలైన తర్వాతి రోజు తన తండ్రి చనిపోవడమే అని అతను వెల్లడించాడు. తమ స్వస్థలంలో నిర్మాణంలో ఉన్న ఇంటి పనులను పర్యవేక్షించడం కోసం హైదరాబాద్ నుంచి వెళ్లిన తన తండ్రి.. పై అంతస్థు నుంచి ప్రమాద వశాత్తూ కిందపడి చనిపోయారని.. అది తన జీవితంలో అతి పెద్ద విషాదం అని.. దాన్నుంచి కోలుకోవడానికి నెల పైనే పట్టిందని.. ఆ పరిస్థితుల్లో ‘ఓ మై ఫ్రెండ్’ ఫలితమేంటి.. ఆ సినిమా ఎలా ఆడుతోంది.. అన్నది కూడా తెలుసుకోలేదని.. చివరికి ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదని తెలిసిందని వేణు తెలిపాడు.

తన తండ్రి మరణంతోనే తన సంతోషాలన్నీ పోయాయని.. తన తొలి చిత్రం సరిగా ఆడలేదని.. ఆ తర్వాత ఓ స్టార్ హీరోతో (రవితేజ) సినిమా మొదలైనట్లే మొదలై ఆగిపోయిందని.. పవన్ కళ్యాణ్ సహా కొందరు స్టార్ల కోసం కథలు రాస్తే ఏవీ వర్కవుట్ కాలేదని.. చిన్న హీరోలను ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని.. దీంతో ఏడేళ్ల గ్యాప్ వచ్చిందని.. చివరికి నాని ‘ఎంసీఏ’ కథకు పచ్చ జెండా ఊపడంతో ఆ సినిమా చేసి హిట్టు కొట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని అతను వెల్లడించాడు.

This post was last modified on July 5, 2020 11:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago