బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కెరీర్ లో పెద్ద హిట్టుగా నిలిచిన సినిమా 2019లో వచ్చిన రాక్షసుడు ఒకటే. తమిళ బ్లాక్ బస్టర్ రట్ససన్ రీమేక్ గా వచ్చిన ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోనూ కమర్షియల్ గా బాగా పే చేసింది. దీన్నే కొంత ఆలస్యంగా హిందీలో పునఃనిర్మించారు. ఇటీవలి కాలంలో థియేట్రికల్ గా వరస డిజాస్టర్లు చూస్తున్న అక్షయ్ కుమార్ హీరోగా ఇది రూపొందింది. అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఎంటర్ కాగా క్యాస్టింగ్ మొత్తం అక్కడి ఆడియన్స్ కి తగ్గట్టు మార్చేశారు. డిస్నీ హాట్ స్టార్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేశారు.
కథ బ్యాక్ డ్రాప్ ని హిమాచల్ ప్రదేశ్ లోని కసౌలి పట్టణానికి సెట్ చేశారు. వరసగా టీనేజ్ అమ్మాయిల హత్యలు జరగడం, డిపార్ట్ మెంట్ లో అండర్ డాగ్ గా ఉన్న పోలీస్ ఆఫీసర్ కేసును ఛేదించడం ఇలా మెయిన్ పాయింట్ మొత్తం అదే తీసుకున్నారు. కాకపోతే సైకో ఫ్లాష్ బ్యాక్ ని బాగా కుదించేసి క్లైమాక్స్ లో స్పీడ్ పెంచారు. అంతే కాదు ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే నిడివి కూడా తగ్గించేశారు. టెంప్లేట్ అయితే కొద్దిపాటి మార్పులతో ఫాలో అయ్యారు కానీ రాక్షసుడులోని ఫీల్ ని పూర్తి స్థాయిలో మోయలేకపోవడంతో కట్ పుత్లీ ఆశించినంత వేగంగా సాగదు.
దర్శకుడు రంజిత్ ఎం తివారి ప్రతిభ కొన్ని సన్నివేశాల్లో కనిపించినప్పటికీ మొత్తంగా చూస్తే అంచనాలను అందుకోవడంలో తడబడ్డాడు. తెలుగు తమిళంలో ప్రాణంగా నిలిచిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హిందీలో మాత్రం తేలిపోయింది. చిరంజీవి సైరా నరసింహారెడ్డికి నేపధ్య సంగీతం అందించిన జూలియస్ పకియం దీనికి పనిచేశాడు. అయితే గిబ్రాన్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాడు. అతన్నే తీసుకున్నా బాగుండేది. యూత్ హీరో చేయాల్సిన క్యారెక్టర్ ని అక్షయ్ చేయడం కొంత మైనస్ అయ్యింది. లేడీ పోలీస్ ఆఫీసర్ ని ఇందులో మార్చేయడం తేడా చేసింది. ఫైనల్ గా చెప్పాలంటే బాలీవుడ్ రాక్షసుడు గాండ్రించబోయే క్యార్ మని సరిపెట్టాడు.
This post was last modified on September 3, 2022 6:21 am
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…