మాములుగా కొత్త సినిమా రిలీజ్ అయితే ఒకే ఊరిలో ఉన్న థియేటర్లు ఒకప్పుడు రీళ్లను ఒక చోటు నుంచి మరో చోటికి రవాణా చేసి పంచుకునేవారు. కాకపోతే షో టైమింగ్స్ లో కనీసం అరగంటకు పైగా గ్యాప్ ఉండేది. శాటిలైట్ ద్వారా డిజిటల్ అయ్యాక ఈ సమస్య తీరిపోయి ఎన్ని స్క్రీన్లు ఉన్నా కేవలం సిగ్నల్ వ్యవస్థ ద్వారా ఒకేసారి ప్రదర్శించే అవకాశం దక్కింది. దీనివల్ల ఏరియాల వారీగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రేక్షకులు తమకు దగ్గరగా అనుకూలంగా ఉండే హాలుకు ఎంచక్కా కోరుకున్న మూవీని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు.
ఇప్పుడీ స్ట్రాటజీని ఓటిటిలు కూడా ఫాలో అవుతున్నాయి. సబ్స్క్రైబర్స్ అందరూ అన్నీ యాప్స్ కి డబ్బులు కట్టరు కాబట్టి వాళ్ళను ఆకట్టుకునేందుకు షేరింగ్ పద్దతిలోకి వెళ్తున్నాయి. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన విక్రమ్ హిట్ లిస్ట్ ఇటీవలే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిది జీ5లోనూ అందుబాటులోకి రానుంది. గతంలో వీటి మధ్య ఇలాగే ఆర్ఆర్ఆర్ పంపకం జరిగింది. కాకపోతే రెండింటి మధ్య డేట్స్ పరంగా కొంత వ్యత్యాసం ఉంటుంది. ఎక్కువ వ్యూయర్స్ చూసేందుకు వేసిన ఎత్తుగడ ఇది.
అలా అని ఇది కొత్త ప్లానేం కాదు. ఆ మధ్య గోపీచంద్ పక్కా కమర్షియల్ ని ఆహాతో పాటు నెట్ ఫ్లిక్స్ కు ఇచ్చారు. గ్లోబల్ రీచ్ కోసం చేసిన ఈ పని మంచి ఫలితాన్నే ఇచ్చింది. గతంలో అల వైకుంఠపురములోని ఇదే తరహాలో నెట్ ఫ్లిక్స్ తో సన్ నెక్స్ట్ వాటాలు వేసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలున్నాయి. ఒక్క అమెజాన్ ప్రైమ్ మాత్రమే కొత్త సినిమాలకు ఇలా డివైడ్ అండ్ షేర్ సూత్రానికి నో చెబుతోంది. పాత చిత్రాలకు మాత్రమే ఆ వెసులుబాటు ఇస్తోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇదో కామన్ ప్రాక్టీస్ గా మారినా ఆశ్చర్యం లేదు.
This post was last modified on September 2, 2022 9:01 pm
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత ఆప్తులైన అధికారులు చాలా మంది ఉన్నారు. ఆయన వస్తే.. పొర్లు దండాలు పెట్టినవారు…
తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ రెండు పదుల వయసులో కూడా లేని స్థితిలో క్యాన్సర్ బారిన పడి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంట్లో ఉన్న గోశాలకు పండగ వచ్చింది. సుమారు 30 గోవులను ఈ గోశాలలో పెంచు తున్నారు.…
డెబ్యూతోనే సెన్సేషనల్ హిట్ అందుకుని ఆ తర్వాత వరస డిజాస్టర్లతో టాలీవుడ్ మార్కెట్ కోల్పోయిన హీరోయిన్ కృతి శెట్టి మలయాళం…
"తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ.. చిట్టినాయుడు. మేం చంద్రబాబు నాయుడితోనే కొట్టాడినం. ఈయనెం త?" అని బీఆర్ ఎస్…
హీరోయిన్గా రెజీనా కసాండ్రా.. ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ.. ఇంకా చాలామంది ప్రముఖ…