Movie News

మల్టీప్లెక్స్ టికెట్ 75 రూపాయలే

అదేంటి చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ సినిమా టికెట్ అయినా సింగల్ స్క్రీన్లలోనూ కనీసం 150 రూపాయలు ఉంటున్న పరిస్థితుల్లో ఇందులో సగానికి అది కూడా మల్టీ ప్లెక్సుల్లో అంటే ఆశ్చర్యపోతున్నారా. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇక్కడ చెప్పింది ముమ్మాటికీ నిజం. కాకపోతే ఇది ఒక్క రోజుకు మాత్రమే పరిమితం కానుంది. సెప్టెంబర్ 16 ఇండియాలో నేషనల్ సినిమా డేగా పాటిస్తారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలోనూ ఏ రిలీజ్ ఉన్నా సరే కేవలం 75 రూపాయలకు టికెట్లు అమ్ముతారట.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇందులో పివిఆర్, ఐనాక్స్ లాంటి కార్పొరేట్ సంస్థలు భాగం కాబోతున్నాయి. అయితే ఆన్ లైన్లో బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రం అదనపు చార్జీలు ఉంటాయి. అలా వద్దనుకుంటే నేరుగా బుకింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్లి డబ్బులిచ్చి తీసేసుకోవడమే. మల్టీప్లెక్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా(MAI) ఈ పథకానికి థాంక్ యు అనే పేరు పెట్టింది. ఇక్కడే కాదు అమెరికాలోనూ కేవలం 3 డాలర్లకు స్క్రీనింగ్ చేయబోయే వెసులుబాటుని అక్కడి ఆడియన్స్ కి ఇవ్వబోతున్నారు

ఇది నిజంగా మంచి పరిణామమే. దీంతో పాటు వారానికి లేదా నెలకో రోజు ఇలాంటి ప్రత్యేక ధరలతో టికెట్లు పెడితే ఎక్కువ మధ్య తరగతి ప్రేక్షకులు మల్టీప్లెక్సుల్లో సినిమాలు చూసే అవకాశం దక్కుతుంది. 9న రాబోయే ప్యాన్ ఇండియా మూవీ బ్రహ్మస్త్రతో పాటు మన తెలుగు సినిమాలు కూడా ఈ ఛాన్స్ ని వాడుకుంటాయేమో చూడాలి. బుకింగ్ యాప్స్ లో వెబ్ సైట్స్ లో ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. ఇలాంటి స్కీములు మరికొన్ని తీసుకొస్తే భవిష్యత్తులో ఓటిటిలు వదిలి మెజారిటీ పబ్లిక్ హాళ్లకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాదంటారా..

This post was last modified on September 2, 2022 6:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

18 minutes ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

24 minutes ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

35 minutes ago

రెండు విషయాల్లో ఉస్తాదే కరెక్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…

1 hour ago

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…

4 hours ago

వివేకా హత్య కేసు.. 4 వారాల్లో తీర్పు!

వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…

4 hours ago