Movie News

మల్టీప్లెక్స్ టికెట్ 75 రూపాయలే

అదేంటి చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ సినిమా టికెట్ అయినా సింగల్ స్క్రీన్లలోనూ కనీసం 150 రూపాయలు ఉంటున్న పరిస్థితుల్లో ఇందులో సగానికి అది కూడా మల్టీ ప్లెక్సుల్లో అంటే ఆశ్చర్యపోతున్నారా. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇక్కడ చెప్పింది ముమ్మాటికీ నిజం. కాకపోతే ఇది ఒక్క రోజుకు మాత్రమే పరిమితం కానుంది. సెప్టెంబర్ 16 ఇండియాలో నేషనల్ సినిమా డేగా పాటిస్తారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలోనూ ఏ రిలీజ్ ఉన్నా సరే కేవలం 75 రూపాయలకు టికెట్లు అమ్ముతారట.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇందులో పివిఆర్, ఐనాక్స్ లాంటి కార్పొరేట్ సంస్థలు భాగం కాబోతున్నాయి. అయితే ఆన్ లైన్లో బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రం అదనపు చార్జీలు ఉంటాయి. అలా వద్దనుకుంటే నేరుగా బుకింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్లి డబ్బులిచ్చి తీసేసుకోవడమే. మల్టీప్లెక్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా(MAI) ఈ పథకానికి థాంక్ యు అనే పేరు పెట్టింది. ఇక్కడే కాదు అమెరికాలోనూ కేవలం 3 డాలర్లకు స్క్రీనింగ్ చేయబోయే వెసులుబాటుని అక్కడి ఆడియన్స్ కి ఇవ్వబోతున్నారు

ఇది నిజంగా మంచి పరిణామమే. దీంతో పాటు వారానికి లేదా నెలకో రోజు ఇలాంటి ప్రత్యేక ధరలతో టికెట్లు పెడితే ఎక్కువ మధ్య తరగతి ప్రేక్షకులు మల్టీప్లెక్సుల్లో సినిమాలు చూసే అవకాశం దక్కుతుంది. 9న రాబోయే ప్యాన్ ఇండియా మూవీ బ్రహ్మస్త్రతో పాటు మన తెలుగు సినిమాలు కూడా ఈ ఛాన్స్ ని వాడుకుంటాయేమో చూడాలి. బుకింగ్ యాప్స్ లో వెబ్ సైట్స్ లో ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. ఇలాంటి స్కీములు మరికొన్ని తీసుకొస్తే భవిష్యత్తులో ఓటిటిలు వదిలి మెజారిటీ పబ్లిక్ హాళ్లకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాదంటారా..

This post was last modified on September 2, 2022 6:46 pm

Share

Recent Posts

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

44 minutes ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

1 hour ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

3 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

7 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

11 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

11 hours ago