Movie News

వాళ్ళ సినిమాలు.. టచ్ చేయలేను

తొలి సినిమా ‘ఉప్పెన’తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తొలి సినిమాకు ఇలాంటి సబ్జెక్ట్, పాత్ర ఎంచుకోవడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఇక రెండో సినిమాగా ‘కొండపొలం’ లాంటి మరో ప్రయోగాత్మక కథలో నటించాడు. ఇప్పుడతను ‘రంగ రంగ వైభవంగా’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో వైష్ణవ్.. తన మావయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను అనుకరించినట్లుగా ప్రోమోల్లో కనిపించింది.

ఈ పోలికలు చూసి చిరు, పవన్ సినిమాలను వైష్ణవ్ రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ మెగా అభిమానుల్లో నడిచింది. ఐతే వైష్ణవ్ మాత్రం అలాంటివ ప్రయత్నం ఎప్పుడూ చేయనని తేల్చి చెప్పేశాడు. కానీ ఈ స్టేట్మెంట్‌కు అతను చిన్న రైడర్ పెట్టాడు.. మావయ్యల సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్లు చేసిన చిత్రాలను మళ్లీ టచ్ చేయాలని అస్సలు అనుకోను. నా ఆలోచన అయితే ఇదే. కానీ ఒకవేళ ఎవరైనా వచ్చి  ఇది బాగుంటుంది, నువ్వే చేయాలి అంటే మాత్రం ‘బద్రి’ని రీమేక్ చేస్తే బాగుంటుందనుకుంటున్నా.. అని వైష్ణవ్ చెప్పాడు.

ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి అడిగితే.. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఎన్.శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమా మినహా కొత్తగా ఏదీ అంగీకరించలేదని చెప్పాడు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోందని వైష్ణవ్ తెలిపాడు.

‘కొండపొలం’ తర్వాత తాను చాలా కథలు విన్నానని.. అవేవీ సంతృప్తినివ్వలేదని.. చివరికి గిరీషయ్య చెప్పిన ‘రంగ రంగ వైభవంగా’ కథ నచ్చి సినిమా చేసినట్లు అతను వెల్లడించాడు. ఈ చిత్రంలో ఖుషి, నిన్నే పెళ్ళాడతా’ సినిమాల ఫ్లేవర్ కనిపించినట్లు కొందరు అన్నారని.. కానీ ఆ సినిమాలకు, దీనికి పోలిక ఉండదని.. కేతికకు, తనకు మధ్య వచ్చే సన్నివేశాలే సినిమాకు హైలైట్ అని అతను చెప్పాడు.

This post was last modified on September 2, 2022 2:03 pm

Share

Recent Posts

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

3 minutes ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

21 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

25 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago