కోట్లు ఖర్చు పెట్టి షూటింగ్ జరగడం కన్నా ఒక సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం నిర్మాతలకు అతి పెద్ద సవాల్ గా మారుతోంది. ఎంత క్లాష్ వద్దనుకున్నా సరే రకరకాల కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఢీ కొట్టేసుకుంటున్నారు. దీనివల్ల ఓపెనింగ్స్ తో పాటు రన్ కూడా దెబ్బ తింటున్నప్పటికీ కేవలం కంటెంట్ మీద నమ్మకంతో దూకేస్తున్నారు. ఈ నెల 23వ తేదీ టాలీవుడ్ బాక్సాఫీస్ కుర్ర హీరోల ఫైటుకు వేదికగా మారబోతోంది.
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నాగశౌర్య ‘కృష్ణ వ్రిందా విహారి’కు ఆ డేట్ కన్నా మంచి ముహూర్తం దొరకలేదు. పోలీస్ ఆఫీసర్ గా శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ‘అల్లూరి’ని అదే రోజున బరిలో దింపుతున్నారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ ప్రెస్ మీట్ కు సైతం ఖాకీ దుస్తుల్లో రావడం చూస్తుంటే నెక్స్ట్ చేయబోయే ప్రమోషన్లు ఇంకెంత వెరైటీగా చేస్తారో అనిపిస్తోంది.
మత్తు వదలరాతో ఆడియన్స్ లో రిజిస్టరైన సింహ కోడూరి ‘దొంగలున్నారు జాగ్రత్త’ వీటితో తలపడనుంది, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి బడా బ్యానర్ అందండలు ఉన్నాయి కాబట్టి పబ్లిసిటీ విషయంలో కొంత శ్రద్ధ తీసుకుంటే అంచనాలు రేపొచ్చు. కాకపోతే మ్యాటర్ బాగుంటేనే ఆడుతుంది అది వేరే విషయం. ఇక సత్యదేవ్ తమన్నాల కన్నడ సూపర్ హిట్ రీమేక్ ‘గుర్తుందా శీతాకాలం’ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వచ్చి చివరాఖరికి 23నే బెస్ట్ ఆప్షన్ గా ఫిక్స్అయ్యింది.
ఇక్కడ చెప్పిన నాలుగు సినిమాల్లోని హీరోలకు పెద్దగా చెప్పుకునేంత భారీ మార్కెట్ ఏమీ లేదు. కాకపోతే ఎవరికి వారు బోలెడు ధీమాగా ఉన్నారు. థియేటర్ కొచ్చిన జనాన్ని మెప్పిస్తామనే కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. పెద్దగా బడ్జెట్ ఖర్చు పెట్టని చిత్రాల విషయంలో ఆడియన్స్ ఈ మధ్య బాగా నిక్కచ్చిగా ఉంటున్నారు. మరి ఈ నాలుగూ విజువల్ గ్రాండియర్స్ కాదు. అలాంటప్పుడు కంటెంట్ తో ఎలా నెగ్గుకొస్తాయో చూడాలి.
This post was last modified on September 2, 2022 7:01 am
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…