సూపర్ స్టార్ మహేష్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో చాన్నాళ్ళకి ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘అతడు’తో మెప్పించిన ఈ కాంబో ‘ఖలేజా’ తో నిరాశ పరిచింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయాలని ప్రయత్నించినా ఇప్పటికి కుదిరింది. త్వరలోనే ఈ కాంబో సినిమా పట్టాలెక్కనుంది. ఈ నెలలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమా మొదలయ్యే లోపు మహేష్ కొన్ని కమర్షియల్ కమిట్మెంట్స్ ఫినిష్ చేయాల్సి ఉంది.
ప్రస్తుతం మహేష్ వాటితో బిజీ అయిపోయాడు. బ్రాండ్ అడ్వర్టైజ్ మెంట్స్ , టివీ సీరియల్ ప్రమోషన్స్ అంటూ వర్క్ చేస్తున్నాడు. అయితే మహేష్ బాబుకు త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా సక్సెస్ అవ్వడం చాలా కీలకం. దీనికి చాలా కారణాలున్నాయి. మహేష్ నుండి ఓ సాలిడ్ హిట్ వచ్చి చాలా ఏళ్లయింది. ‘శ్రీమంతుడు’ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి తప్ప భారీ వసూళ్ళు అందించలేదు. ‘భరత్ అనే నేను’ చాలా చోట్ల లాస్ మిగిల్చింది. ఈ విషయాన్ని కొరటాల స్వయంగా చెప్పుకున్నాడు కూడా.
ఇక మహర్షి , సరిలేరు నీకెవ్వరు , సర్కారు వారి పాట సినిమాలు కంటెంట్ పరంగా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాయి. సరిలేరు మాత్రం సంక్రాంతి సీజన్ లో మంచి వసూళ్ళు రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అందుకే త్రివిక్రమ్ సినిమాతో మహేష్ ఓ సాలిడ్ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. మహేష్ రాజమౌళి తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా కంటే ముందు త్రివిక్రమ్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొడితే ఆ ప్రాజెక్ట్ కి చాలా ప్లస్ అవుతుంది. లేదంటే రాజమౌళి సక్సెస్ తోనే దాన్ని మార్కెట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మహేష్ కి ఆ ప్రాజెక్ట్ ముందు సాలిడ్ హిట్ ఉంటే ఇంకా ప్లస్ అవుతుంది.
ఇక మహేష్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా థియేటర్స్ కి తీసుకొచ్చే క్లాస్ సినిమా కూడా ఈ మధ్య రాలేదు. సూపర్ స్టార్ నుండి రీసెంట్ గా అన్నీ కమర్షియల్ సినిమాలే వచ్చాయి. మహర్షిలో క్లాస్ టచ్ ఉన్నా ఆ సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అనుకున్నంతగా రాలేదు. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే కథలోనే ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఈసారి టాక్ బాగుంటే థియేటర్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ గట్టిగా కనిపిస్తారు. సో ఎలా చూసుకున్నా మహేష్ SSMB28 తో ఓ సాలిడ్ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇన్నేళ్ళ తర్వాత మహేష్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ సూపర్ స్టార్ కి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.
This post was last modified on September 1, 2022 10:20 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…