కెరీర్ కొంచెం ఒడుదొడుకుల్లో ఉన్న నిఖిల్ అనే యంగ్ హీరో.. అనుపమ పరమేశ్వరన్ అనే ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్.. చివరగా పెద్ద డిజాస్టర్ ఇచ్చిన చందూ మొండేటి అనే దర్శకుడు.. ఇలాంటి కలయికలో వచ్చిన సినిమా ‘కార్తికేయ-2’. సూపర్ హిట్ మూవీ ‘కార్తికేయ’కు సీక్వెల్ అయినప్పటికీ.. ఈ చిత్రంపై మరీ అంచనాలైతే లేవు. సినిమా బాగా ఆలస్యం అయి, వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు ఆగస్టు 13న విడుదలైంది.
సినిమాకు మంచి టాక్ వచ్చినా సరే.. ఒక 30 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు రాబడుతుందని అనుకున్నారంతా. కానీ ఇప్పుడా సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని అందుకుంటోంది. బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్లు నటించిన సినిమాలకు కూడా ఈ మార్కును అందుకోవడం చాలా కష్టమైపోయింది ఇప్పుడు. అలాంటిది కేవలం హిందీలోనే రూ.25 కోట్ల గ్రాస్ మార్కు దిశగా అడుగులు వేస్తోందీ చిత్రం.
హిందీ ప్రేక్షకులకు నిఖిల్ గురించి పెద్దగా తెలియదు. ‘కార్తికేయ’ అనే హిట్ మూవీకి ఇది సీక్వెల్ అని వాళ్లకు ఐడియా లేదు. రిలీజయ్యే ముందు వరకు ఈ సినిమాను పట్టించుకున్నదే లేదు. విడుదల కూడా నామమాత్రంగా జరిగింది. ప్రమోషన్లూ లేవు. కానీ మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. అక్కడి జనాలకు సినిమా ఎక్కేసింది. రోజు రోజుకూ దాని థియేటర్లు, షోలు విస్తరించాయి. సినిమా ఊహించని స్థాయికి చేరుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు నుంచి ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ సాగింది.
మద్యలో వచ్చిన ఇండిపెండెన్స్ డే, ‘కృష్ణాష్టమి’ సెలవులను, మిగతా సెలవులను చక్కగా ఉపయోగించుకుందీ చిత్రం. ఇప్పుడు ‘వినాయక చవితి’ కూడా దానికి పెద్ద ప్లస్సే. ఇండియా అంతటా జనాలు పండుగ రోజు ఉండే మూడ్లో ‘కార్తికేయ-2’ లాంటి సినిమానే చూడాలనుకుంటారు. కాబట్టి తొలి వీకెండ్ రోజుల్లో మాదిరి బుధవారం వసూళ్లు రావడం గ్యారెంటీ. చవితి రోజే ఈ చిత్రం అధికారికంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును కూడా అందుకోబోతోంది. ఈ చిన్న సినిమాకు ఇది ఎంత గొప్ప ఫీటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
This post was last modified on August 31, 2022 12:41 pm
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…
ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…