కెరీర్ కొంచెం ఒడుదొడుకుల్లో ఉన్న నిఖిల్ అనే యంగ్ హీరో.. అనుపమ పరమేశ్వరన్ అనే ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్.. చివరగా పెద్ద డిజాస్టర్ ఇచ్చిన చందూ మొండేటి అనే దర్శకుడు.. ఇలాంటి కలయికలో వచ్చిన సినిమా ‘కార్తికేయ-2’. సూపర్ హిట్ మూవీ ‘కార్తికేయ’కు సీక్వెల్ అయినప్పటికీ.. ఈ చిత్రంపై మరీ అంచనాలైతే లేవు. సినిమా బాగా ఆలస్యం అయి, వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు ఆగస్టు 13న విడుదలైంది.
సినిమాకు మంచి టాక్ వచ్చినా సరే.. ఒక 30 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు రాబడుతుందని అనుకున్నారంతా. కానీ ఇప్పుడా సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని అందుకుంటోంది. బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్లు నటించిన సినిమాలకు కూడా ఈ మార్కును అందుకోవడం చాలా కష్టమైపోయింది ఇప్పుడు. అలాంటిది కేవలం హిందీలోనే రూ.25 కోట్ల గ్రాస్ మార్కు దిశగా అడుగులు వేస్తోందీ చిత్రం.
హిందీ ప్రేక్షకులకు నిఖిల్ గురించి పెద్దగా తెలియదు. ‘కార్తికేయ’ అనే హిట్ మూవీకి ఇది సీక్వెల్ అని వాళ్లకు ఐడియా లేదు. రిలీజయ్యే ముందు వరకు ఈ సినిమాను పట్టించుకున్నదే లేదు. విడుదల కూడా నామమాత్రంగా జరిగింది. ప్రమోషన్లూ లేవు. కానీ మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. అక్కడి జనాలకు సినిమా ఎక్కేసింది. రోజు రోజుకూ దాని థియేటర్లు, షోలు విస్తరించాయి. సినిమా ఊహించని స్థాయికి చేరుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు నుంచి ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ సాగింది.
మద్యలో వచ్చిన ఇండిపెండెన్స్ డే, ‘కృష్ణాష్టమి’ సెలవులను, మిగతా సెలవులను చక్కగా ఉపయోగించుకుందీ చిత్రం. ఇప్పుడు ‘వినాయక చవితి’ కూడా దానికి పెద్ద ప్లస్సే. ఇండియా అంతటా జనాలు పండుగ రోజు ఉండే మూడ్లో ‘కార్తికేయ-2’ లాంటి సినిమానే చూడాలనుకుంటారు. కాబట్టి తొలి వీకెండ్ రోజుల్లో మాదిరి బుధవారం వసూళ్లు రావడం గ్యారెంటీ. చవితి రోజే ఈ చిత్రం అధికారికంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును కూడా అందుకోబోతోంది. ఈ చిన్న సినిమాకు ఇది ఎంత గొప్ప ఫీటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
This post was last modified on August 31, 2022 12:41 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…