మాములుగా ఓ పిసినారి టూత్ పేస్ట్ వాడకం ఎలా ఉంటుందంటే ట్యూబ్ ని చావచితకొట్టి చివరి బొట్టు దాకా మొత్తం పిండేశాకే బయట పారేస్తాడు. ఆమె సినిమాలో కోట శ్రీనివాసరావు పాత్రను ఉదాహరణగా తీసుకోవచ్చు. కానీ మరీ అంత దుర్మార్గంగా అందరూ ఉండరు కానీ ఈ మధ్యకాలంలో మన దర్శకుల ఫార్ములా తీరు ఇదే స్పష్టం చేస్తోంది. లైగర్ కు బాక్సాఫీస్ దగ్గర చావు దెబ్బ తప్పలేదు. ఎన్ని ప్రమోషన్లు చేసినా ఎన్నో గొప్పలు పోయినా ముంబై నుంచి మంగళగిరి దాకా ప్రేక్షకులు నిర్మొహమాటంగా ఒకే డిజాస్టర్ తీర్పు ఇచ్చేశారు.
కొన్ని నెలల క్రితం వరుణ్ తేజ్ ‘గని’ కూడా ఇదే తరహాలో ఘోర పరాజయం మూటగట్టుకుంది. అందులో ఉన్నది కూడా బాక్సింగ్ బ్యాక్ డ్రాపే. నాగ శౌర్య చాలా కష్టపడి ఆర్చరీ సెటప్ ఏదో ఆడియన్స్ కి కొత్తగా ఉంటుందని చేస్తే ‘లక్ష్య’ వారం తిరక్కుండానే బయ్యర్లకు చుక్కలు చూపించింది. కీర్తి సురేష్ ని నగేష్ కుకునూర్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ డీల్ చేసినా గన్ షూటింగ్ క్రీడను, నీరసమైన స్క్రీన్ ప్లేని ‘గుడ్ లక్ సఖి’లో మనవాళ్ళు అంగీకరించలేదు. అంతెందుకు నాని ‘జెర్సీ’ ఎమోషనల్ గా ఎంత ఆకట్టుకున్నా కమర్షియల్ గా అద్భుతాలేం చేయలేదు.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. రాను రాను ఈ స్పోర్ట్స్ డ్రామాలు జనానికి బోర్ కొట్టేస్తున్నాయి. ఒక ఆట, విధి రాతకు వంచితుడైన హీరో, అతనికో గురువు, ఇంటర్ నేషనల్ పోటీల్లో చివరిగా విజేతగా నిలవడం. ఈ పరిధి దాటి ఏ దర్శక రచయిత కొత్తగా ఆలోచించలేకపోతున్నాడు. అలాంటప్పుడు తీయకపోవడం మంచిది కదా. తెలుగు క్రికెటర్ మిథాలి రాజ్ కథను ‘శభాష్ మితు’గా చూపిస్తే ఎవరు పట్టించుకున్నారని. సో ఇకనైనా వీటికి స్వస్తి పలికి ఎలాంటి కంటెంట్ తో థియేటర్లను నింపగలమనే దాని మీద డైరెక్టర్లు దృష్టి పెడితే మంచిది. కార్తికేయ 2 కన్నా ఉత్తమమైన ఉదాహరణ ఇంకేం కావాలి.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…