హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ సినిమాలతో పట్టువదలని విక్రమార్కుడిలా పలకరిస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత ఏడాది ఛత్రపతి రీమేక్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో అదే టైటిల్ తో కొద్దిపాటి మార్పులతో సగానికి పైగానే షూటింగ్ పూర్తి చేశారు. పెన్ స్టూడియోస్ నిర్మాణం కావడంతో బడ్జెట్ విషయంలోనూ రాజీ లేకుండా చేస్తున్నారని టాక్ వచ్చింది. అయితే ఏమయ్యిందో ఏమో కానీ నెలల తరబడి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. వినాయక్ సైతం ఎక్కడా దాని ప్రస్తావన తేవడం లేదు.
ఈ సినిమా కోసమే ముంబైలో మకాం పెట్టేసిన సాయిశ్రీనివాస్ ఆ మధ్య స్టువర్ట్ పురం దొంగను హడావిడిగా ప్రకటించాడు. తీరా చూస్తే అదే కథతో రవితేజ ప్రాజెక్టు లాకవ్వడంతో తనది డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. రాక్షసుడు హిట్టు కొట్టి తర్వాత అల్లుడు అదుర్స్ తో డిజాస్టర్ అందుకున్న శ్రీనివాస్ వచ్చే జనవరికి తెరమీద కనపడి రెండేళ్లు దాటుతుంది. ఎంత సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నా డబ్బింగ్ శాటిలైట్ తదితరాల రూపంలో ఇతనికి మార్కెట్ అయితే ఉంది. అందుకే తెలుగులో సినిమాలు తీయాలనుకునే వాళ్ళు వస్తూనే ఉన్నారు.
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం శ్రీనివాస్ ఓ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. నిఖిల్ కు అర్జున్ సురవరం రూపంలో మంచి హిట్ ఇచ్చిన టిఎన్ సంతోష్ చెప్పిన లైన్ ఒకటి ఆకట్టుకోవడంతో ఫైనల్ వెర్షన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిసింది. ఛత్రపతికి ఇంకొంచెం టైం పట్టేలా ఉంది కనక మరీ ఆలస్యం చేస్తే టాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్షన్ లైట్ అయిపోతుంది కాబట్టి దీనికి సంబంధించిన నిర్ణయం త్వరలోనే తీసుకోవచ్చని అంటున్నారు. తమ్ముడు గణేష్ అక్టోబర్ లో స్వాతిముత్యంతో వెండితెర ప్రవేశం చేస్తున్నాడు. ఈలోగా అన్నయ్య రీ ఎంట్రీ కన్ఫర్మ్ అవుతుందో లేదో.
This post was last modified on August 29, 2022 8:22 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…