అనుదీప్ కేవీ.. జాతిరత్నాలు సినిమాతో ఈ పేరు మార్మోగిపోయింది. పిట్టగోడ అనే ఎవరికీ పట్టని చిన్న సినిమాతో దర్శకుడగా పరిచయం అయిన ఈ కుర్రాడు.. జాతిరత్నాలుతో థియేటర్లను నవ్వుల్లో ముంచెత్తాడు. ఆ చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంట పండించాడు. చిన్న సినిమాతో భారీ విజయం సాధించడంతో అతడికి క్రేజీ ఆఫర్లు వచ్చాయి.
ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్తో పెద్ద బడ్జెట్లో తెలుగు-తమిళ భాషల్లో ప్రిన్స్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈలోపు అనుదీప్ కథ అందించిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మీడియాను కలిసిన అతను.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడాడు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే తాను సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్తో జట్టు కట్టే అవకాశమున్నట్లు అతను సంకేతాలు ఇచ్చాడు.
వెంకటేష్కు త్వరలోనే తాను ఒక కామెడీ కథను నరేట్ చేయబోతున్నట్లు అనుదీప్ వెల్లడించాడు. తమ కలయికలో సినిమా వచ్చేందుకు ఆస్కారముందని చెప్పాడు. దీనికి తోడు తనకు పెద్ద లైనప్పే ఉన్నట్లు అనుదీప్ వెల్లడించాడు. వాటి వివరాలు తర్వాత చెబుతానన్నాడు. నిజానికి ఫస్ట్ డే ఫస్ట్ షో కథను కూడా తానే డైరెక్ట్ చేయాల్సిందని అనుదీప్ చెప్పాడు.
కానీ తనకు ఖాళీ లేకపోవడం వల్ల, తన అసిస్టెంట్లయిన వంశీ, లక్ష్మీనారాయణలకు ఈ కథ నచ్చి, ఓన్ చేసుకోవడంతో వారికి ఈ కథను తెరకెక్కించే బాధ్యత అప్పగించినట్లు తెలిపాడు. తన జీవిత అనుభవాల నేపథ్యంలోనే ఫస్ట్ డే ఫస్ట్ షో కథ రాశానని.. తాను నిజంగానే పవన్ కళ్యాణ్ అభిమానిని అని.. ఖుషి సినిమాకు తొలి రోజు టికెట్లు సంపాదించడం కష్టమైందని.. పవన్ ప్రతి సినిమానూ తాను తొలి రోజే చూడటానికి కష్టపడేవాడినని అనుదీప్ తెలిపాడు. రెండు రోజుల వ్యవధిలో నడిచే ఈ కథ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని అనుదీప్ ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on August 28, 2022 1:41 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…