దేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ లాల్ ఒకరు. ఆయన్ని భాషలకు అతీతంగా కోట్లాదిమంది అభిమానిస్తారు. మలయాళం అర్థం చేసుకోవడం చాలా కష్టం అయినా సరే.. ఇతర భాషల వాళ్లు కేవలం మోహన్ లాల్ నటన కోసం ఆయన సినిమాలను చూస్తారు. వాళ్లను తన సమ్మోహన నటనా శక్తితో కట్టిపడేసి ఎంటర్టైన్ చేయడం మోహన్ లాల్కే చెల్లు.
ఆయన తెలుగులో ‘మనమంతా’ చిత్రంలో లీడ్ రోల్ చేయడంతో పాటు ‘జనతా గ్యారేజ్’ కీలక పాత్ర చేసి తెలుగు ప్రేక్షకులకు నేరుగా తన టాలెంట్ ఏంటో చూపించారు. ‘పులి మురుగన్’ సహా కొన్ని డబ్బింగ్ సినిమాలూ ఆయన్ని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేశాయి. కాగా కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ ఆయన తెలుగులో డైరెక్ట్ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాకు ‘వృషభ’ అనే టైటిల్ కూడా ఖరారైంది. తెలుగుతో పాటు మలయాళంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.
విశేషం ఏంటంటే.. ‘వృషభ’ చిత్రాన్ని రూపొందించబోయేది ఒక కన్నడ దర్శకుడు. అతడి పేరు.. నందకిషోర్. ఈ చిత్రంలో ఒక ప్రముఖ తెలుగు కథానాయకుడు కూడా నటిస్తాడట. ఒక రకంగా చెప్పాలంటే ఇది ‘జనతా గ్యారేజ్’ తరహా మల్టీస్టారర్ అని చెప్పొచ్చు. ఒక కన్నడ దర్శకుడు మలయాళ, తెలుగు హీరోలతో తెలుగు, మలయాళ భాషల్లో మల్టీస్టారర్ తీయడం విశేషమే. ఈ చిత్రాన్ని అభిషేక్ వ్యాస్, ప్రవీర్ సింగ్, శ్యామ్ సుందర్ కలిసి నిర్మించనున్నారు.
బేసిగ్గా తెలుగు, మలయాళ చిత్రాల్లో తెరకెక్కినప్పటికీ.. పలు భాషల్లో దీన్ని రిలీజ్ చేస్తారట. 60 ప్లస్ వయసులో ఉన్న మోహన్ లాల్.. సినిమాలు చేయడంలో చూపించే వేగం, ఆయన ఎంచుకునే సబ్జెక్టులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఏడాదికి మూణ్నాలుగు రిలీజ్లు ఉంటాయి. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇమేజ్ గురించి పట్టించుకోకుండా ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ లక్షణాలే మిగతా స్టార్ హీరోలందరికీ ఆయన్ని భిన్నంగా నిలుపుతుంది.
This post was last modified on August 27, 2022 9:09 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…