దేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ లాల్ ఒకరు. ఆయన్ని భాషలకు అతీతంగా కోట్లాదిమంది అభిమానిస్తారు. మలయాళం అర్థం చేసుకోవడం చాలా కష్టం అయినా సరే.. ఇతర భాషల వాళ్లు కేవలం మోహన్ లాల్ నటన కోసం ఆయన సినిమాలను చూస్తారు. వాళ్లను తన సమ్మోహన నటనా శక్తితో కట్టిపడేసి ఎంటర్టైన్ చేయడం మోహన్ లాల్కే చెల్లు.
ఆయన తెలుగులో ‘మనమంతా’ చిత్రంలో లీడ్ రోల్ చేయడంతో పాటు ‘జనతా గ్యారేజ్’ కీలక పాత్ర చేసి తెలుగు ప్రేక్షకులకు నేరుగా తన టాలెంట్ ఏంటో చూపించారు. ‘పులి మురుగన్’ సహా కొన్ని డబ్బింగ్ సినిమాలూ ఆయన్ని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేశాయి. కాగా కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ ఆయన తెలుగులో డైరెక్ట్ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాకు ‘వృషభ’ అనే టైటిల్ కూడా ఖరారైంది. తెలుగుతో పాటు మలయాళంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.
విశేషం ఏంటంటే.. ‘వృషభ’ చిత్రాన్ని రూపొందించబోయేది ఒక కన్నడ దర్శకుడు. అతడి పేరు.. నందకిషోర్. ఈ చిత్రంలో ఒక ప్రముఖ తెలుగు కథానాయకుడు కూడా నటిస్తాడట. ఒక రకంగా చెప్పాలంటే ఇది ‘జనతా గ్యారేజ్’ తరహా మల్టీస్టారర్ అని చెప్పొచ్చు. ఒక కన్నడ దర్శకుడు మలయాళ, తెలుగు హీరోలతో తెలుగు, మలయాళ భాషల్లో మల్టీస్టారర్ తీయడం విశేషమే. ఈ చిత్రాన్ని అభిషేక్ వ్యాస్, ప్రవీర్ సింగ్, శ్యామ్ సుందర్ కలిసి నిర్మించనున్నారు.
బేసిగ్గా తెలుగు, మలయాళ చిత్రాల్లో తెరకెక్కినప్పటికీ.. పలు భాషల్లో దీన్ని రిలీజ్ చేస్తారట. 60 ప్లస్ వయసులో ఉన్న మోహన్ లాల్.. సినిమాలు చేయడంలో చూపించే వేగం, ఆయన ఎంచుకునే సబ్జెక్టులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఏడాదికి మూణ్నాలుగు రిలీజ్లు ఉంటాయి. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇమేజ్ గురించి పట్టించుకోకుండా ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ లక్షణాలే మిగతా స్టార్ హీరోలందరికీ ఆయన్ని భిన్నంగా నిలుపుతుంది.
This post was last modified on August 27, 2022 9:09 pm
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…