హాలీవుడ్లో బన్నీ.. హాలీవుడ్లో బన్నీ.. నిన్నట్నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను పురస్కరించుుకుని అమెరికాలో పరేడ్లో పాల్గొనేందుకు భార్య స్నేహా రెడ్డితో కలిసి అల్లు అర్జున్ వెళ్లడం తెలిసిందే. ఆ కార్యక్రమం సందడిగా సాగిందికూడా. ఐతే బన్నీ వెళ్లింది కేవలం ఈ పరేడ్ కోసమే కాదని.. అక్కడ ఒక హాలీవుడ్ దర్శకుడితో మీటింగ్ జరిగిందని, అతను బన్నీకి ఒక కథ చెప్పాడని, అందులో ఓ కీలక పాత్ర ఆఫర్ చేశాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఐతే ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన మాట వాస్తవం. అలా అని ఈ చిత్రం ప్రపంచ స్థాయికేమీ చేరిపోలేదు. మరీ హాలీవుడ్ స్థాయిలో బన్నీ పాపులర్ అయిపోలేదు. ఐతే ధనుష్ ఇంత పాపులర్ కాకముందే హాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు అందుకున్నాడు కాబట్టి బన్నీకి అవకాశం లభిస్తే మరీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ఐతే బన్నీ పీఆర్ వ్యవహారాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. దేశంలోనే బన్నీకి ఉన్నంత పీఆర్ సపోర్ట్ ఇంకే హీరోకూ లేదు అంటే అతిశయోక్తి కాదు. అతడి గురించి రకరకాల హైప్ వార్తలు పుట్టించి సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలో పబ్లిష్ చేయించి ప్రచారం చేయడం మామూలే. న్యూయార్క్లో జరిగిన పరేడ్లో 5 లక్షల మంది పాల్గొన్నట్లు బన్నీ పీఆర్వోలు ప్రకటనలు ఇచ్చారంటే వారి హైప్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
కానీ ఏ ఫొటోలో కూడా వందల్లో తప్పితే కొన్ని వేల మంది జనాలు కూడా కనిపించలేదు. మరి అమెరికాలో బన్నీ కోసం ఐదు లక్షల మంది వచ్చారంటే ఎలా నమ్మాలి? ఈ నేపథ్యంలోనే హాలీవుడ్ సినిమాలో బన్నీ అనే వార్త కూడా పబ్లిసిటీ గిమ్మిక్కేనేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘పుష్ప-2’ చేయడానికి ముందు బన్నీకి మరింత ఎలివేషన్ ఇచ్చి ఆ సినిమా రేంజి పెంచడానికే ఇలాంటి పీఆర్ గిమ్మిక్కులు ట్రై చేస్తున్నారేమో అనిపిస్తోంది.
This post was last modified on August 26, 2022 8:11 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…