ఒకవేళ లైగర్ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని ఉంటే ఇప్పుడు బాలీవుడ్ లో సీన్ వేరేగా ఉండేది. హిందీ వెర్షన్ ని ఒక రోజు ఆలస్యంగా విడుదల చేయాలనే స్ట్రాటజీ రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక్కడ తేడా కొట్టినా సాహోలాగా అక్కడ కొంత బెటర్ రిజల్ట్ తెచ్చుకునే సూచనలు తక్కువగానే ఉన్నాయి. ప్రభాస్ కాబట్టి దానికా మాత్రం వసూళ్లు వచ్చాయి. కానీ విజయ్ దేవరకొండకు కావడమే లైగర్ డెబ్యూ మూవీ అయ్యింది. అలాంటప్పుడు హీరో ఇమేజ్ అక్కడ పని చేసే అవకాశాలు లేనట్టే. ఇంకో రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.
ఇక సెప్టెంబర్ లో రాబోయే రెండు ప్యాన్ ఇండియా సినిమాలే నార్త్ ట్రేడ్ ని రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో మొదటిది బ్రహ్మాస్త్ర. ప్రమోషన్ల స్పీడ్ పెంచుతున్నారు కానీ దానికి తగ్గ బజ్ న్యూట్రల్ ఆడియన్స్ లో కనిపించడం లేదు. ఈవెంట్లు ప్రెస్ మీట్లు జరుగుతూనే ఉన్నాయి. రాజమౌళి నాగార్జునలు చెన్నై వెళ్లి మరీ స్పెషల్ గా పబ్లిసిటీ ఇచ్చారు. నెక్స్ట్ రెండు భాగాలకు బిజినెస్ జరగాలంటే బ్రహ్మాస్త్ర పార్ట్ 1 ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ రేంజ్ లో ఆడాలి. లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది.
రెండోది మణిరత్నం పొన్నియన్ సెల్వన్. టైటిల్ తో మొదలుపెట్టి బ్యాక్ డ్రాప్ దాకా మొత్తం తమిళ వాసన కొడుతున్న ఈ గ్రాండియర్ తెలుగు హిందీ భాషల్లో ఏ మాత్రం పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికి హైప్ పరంగా ఈ రెండు ఒకే స్టేజిలో ఉన్నాయి. ఏదో బాహుబలి రేంజ్ లో హడావిడి చేస్తాయనుకుంటే ఆ సూచనలు అంతగా లేవు. చేతిలో ఉన్న తక్కువ టైంని పూర్తిగా వాడుకుని జనాల్లో ఇంకా బలంగా దీన్ని తీసుకెళ్లేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ మీద గట్టి ఫోకసే పెడుతున్నారు.
This post was last modified on August 25, 2022 10:35 pm
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…