అక్టోబర్ 5 విడుదల కాబోతున్న నాగార్జున ది ఘోస్ట్ మీద అక్కినేని అభిమానుల అంచనాలు మాములుగా లేవు. గత కొంత కాలంగా కింగ్ ట్రాక్ రికార్డు అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ఇది కోరుకున్న బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇవాళ మహేష్ బాబుతో ట్రైలర్ లాంచ్ చేయించారు. డాక్టర్ రాజశేఖర్ ఫామ్ లో లేని టైంలో ఆయనకు గరుడవేగా రూపంలో మంచి సక్సెస్ ఇచ్చిన ప్రవీణ్ సత్తారు దర్శకుడు కావడం ది ఘోస్ట్ కి ప్లస్ అవుతోంది. వైల్డ్ డాగ్ తర్వాత మరోసారి పూర్తి ఇంగ్లీష్ టైటిల్ తోనే నాగ్ వస్తుండటం విశేషం.
ఇక కంటెంట్ విషయానికి వస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ అయినప్పటికీ ఇందులో సెంటిమెంట్ థ్రెడ్ కూడా పెట్టారు. హీరో క్యారెక్టర్ పేరు విక్రమ్. తనకో అక్క ఆమెకో కూతురుందని తండ్రి ద్వారా ఆలస్యంగా తెలుస్తుంది. ఈలోగా వాళ్ళో పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటారు. రక్షించే బాధ్యతను విక్రమ్ తీసుకుంటాడు. అయితే అనుకున్నంత సులువుగా ఇదంతా ఉండదు. దేశ విదేశాలు దాటి తోబుట్టువుని మేనకోడలిని కాపాడుకునే మిషన్ ప్రాణాంతంగా మారుతుంది. ఆ తర్వాత జరిగేదే ది ఘోస్ట్ స్టోరీగా కనిపిస్తోంది.
మొత్తానికి హైప్ పెంచడంలో ఈ ట్రైలర్ ప్లస్ అయ్యేలా ఉంది. అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం కిల్లర్ అనే మూవీలో శారద, బేబీ షాలినిలను ముందు చంపాలనుకుని ఆ తర్వాత వాళ్ళను విలన్ల నుంచి రక్షించే క్యారెక్టర్ లో నాగ్ మెప్పించారు. దాంతో పోల్చుకుంటే బడ్జెట్ స్కేల్, టెక్నాలజీ బాగా పెరిగిన ది ఘోస్ట్ లో ఆకర్షణలు చాలానే కనిపిస్తున్నాయి. సోనాలి చౌహన్ హీరోయిన్ గా కాగా గుల్ పనాంగ్ తో పాటు అజిత్ విశ్వాసంలో నటించిన అనిఖా సురేంద్రన్ ఇందులో ముఖ్యపాత్ర దక్కించుకుంది. సో ఘోస్ట్ లో యాక్షన్ ప్లస్ ఎమోషన్ రెండూ ఉండబోతున్నాయన్న మాట.
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…