హిందీలో బాగా పాపులర్ అయిన టీవీ షోల్లో ‘కాఫీ విత్ కరణ్’ ఒకటి. అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ షోను నిర్వహిస్తుంటాడు. ఆరు సీజన్ల పాటు టీవీలో ప్రసారం అయిన ఈ షో.. ఇప్పుడు హాట్ స్టార్ ఓటీటీకి మారింది. కొత్త సీజన్ హాట్ హాట్గా నడుస్తూ వ్యూయర్స్ను బాగా ఎంగేజ్ చేస్తోంది. ఐతే ఈ షోలో బూతులు మరీ శ్రుతి మించుతున్నాయని, కరణ్ ఎప్పుడూ సెక్స్, అక్రమ సబంధాల చుట్టూ ప్రశ్నలు తిప్పుతూ విసిగిస్తున్నాడని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మీరు ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొంటారా అని తాప్సిని అడిగితే.. ఆ షోకు వెళ్లేంత గొప్పగా నా శృంగార జీవితం లేదంటూ కౌంటర్ వేయడాన్ని బట్టి కరణ్ ప్రోగ్రాం ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. తాప్సి లాంటి సెలబ్రెటీనే ఇలా అందంటే.. ఇక మామూలు జనాలు షో గురించి ఎలా మాట్లాడుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఐతే ఈ వ్యతిరేకత, విమర్శల విషయంలో కరణ్ జోహార్ సరదాగా స్పందించాడు. తన షోను చాలామంది విమర్శించడానికే చూస్తున్నారని, తిట్టే వాళ్ల వల్లే షోకు వ్యూయర్ షిప్ పెరుగుతోందని అతనన్నాడు. ‘‘నా షో గురించి కొందరు చేస్తున్న విమర్శలకు నేను సమాధానం చెప్పాలి. ఇటీవల సోషల్ మీడియాలో నా షోను తిడుతూ చేసిన ఇన్స్టా రీల్స్ను చూసి ఆశ్చర్యపోయా. నేను కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే ఇన్నేళ్లుగా షోను నడిపిస్తున్నా.
ఐతే దీని పట్ల ద్వేషం చూపించేవాళ్లు ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. వాళ్ల సమయాన్ని నా కోసం కేటాయిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ షోను తిట్టేవాళ్లే దీన్ని ఎక్కువగా చూస్తున్నారు’’ అని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ పేర్కొన్నాడు. ‘కాఫీ విత్ కరణ్’ కొత్త సీన్లో టాలీవుడ్ నుంచి సమంత, విజయ్ దేవరకొండ వేర్వేరు ఎపిసోడ్లలో పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్లో షాహిద్ కపూర్, కియారా అద్వానీ మెరవబోతున్నారు.
This post was last modified on August 25, 2022 3:45 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…