Movie News

ఖుషి బ్రాండ్ పని చేస్తుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లు సినిమాల్లో వాడటం చాలా సార్లు చూసిందే. నితిన్ లాంటి నోటెడ్ స్టార్ తో మొదలుపెట్టి షకలక శంకర్ లాంటి కమెడియన్ దాకా అందరూ పిండేశారు. కాకపోతే వీళ్లంతా ఏ పాటకో సీన్ కో దాన్ని పరిమితం చేశారు కానీ ఏకంగా పవన్ పాత సినిమా బ్రాండింగ్ తో ఓ కథ రాసి రెండు గంటల మూవీ చేయడం మాత్రం ఎప్పుడూ జరగలేదు. జాతిరత్నాలుతో ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు కెవి అనుదీప్ స్వయంగా రచన చేసిన ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ కాన్సెప్ట్ తో విడుదలకు రెడీ అవుతోంది.

ట్రైలర్ రిలీజ్ చేశారు. రెండు నిమిషాల వీడియో మొత్తం పవన్ నామస్మరణ ఖుషి తాలూకు మెమోరీస్ తో నింపేశారు. ప్రేమించిన అమ్మాయి ఖుషి మొదటి రోజు మొదటి ఆట టికెట్లు అడిగితే దాన్ని సంపాదించడానికి ఓ కుర్రాడు పడే పాట్లనే సినిమాగా తీసేశారు. వంశీధర్-లక్ష్మినారాయణలు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఒకప్పుడు కె విశ్వనాథ్ గారితో అద్భుతమైన దృశ్యకావ్యాలని తీసిన పూర్ణోదయా సంస్థ వారసులు ప్రొడ్యూస్ చేసిన చిత్రమిది. లీడ్ పెయిర్ కొత్త మొహాలను తీసుకున్నా మిగిలిన పాత్రలకు భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్లనే పెట్టుకున్నారు.

అంతా బాగానే ఉంది కానీ సోషల్ మీడియాలో చిన్న చిన్న విషయాలకే అర్థం లేకుండా ట్రోల్ చేసుకునే హీరోల అభిమానులు ముక్తకంఠంతో ఇప్పుడీ పవన్ బ్రాండ్ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది కానీ న్యూట్రల్ ఆడియన్స్ మొదటి నుంచి చివరి దాకా ఒకే పాయింట్ మీద నడిచే కథను ఒప్పుకోవడం మీద దీని సక్సెస్ ఆధారపడి ఉంది. ముందు సెప్టెంబర్ 2 విడుదల అన్నారు కానీ ఇప్పుడీ ట్రైలర్ లో మాత్రం కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్ అని పెట్టారు. మరి మార్పేదైనా ఉంటుందేమో..

Satya

Recent Posts

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

10 minutes ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

2 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

2 hours ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

2 hours ago

జాన్వీ కపూర్ దురదృష్టం అలా ఉంది

పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…

3 hours ago

కృష్ణలంక వివాదాన్ని బాబు ఎలా హ్యాండిల్ చేశారు?

రాజ‌కీయ చతుర‌త‌లో మ‌రోసారి టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు చాణ‌క్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. స‌ర్కారును ఇరుకున పెట్టేసి.. కుల‌,…

4 hours ago