Movie News

పుష్ప‌-2.. ఒక కీల‌క మార్పు

మొత్తానికి మోస్ట్ అవైటెడ్ సీక్వెల్  పుష్ప‌-2 సినిమాకు సంబంధించి ఎట్ట‌కేల‌కు ఒక క‌ద‌లిక వ‌చ్చింది. సోమ‌వార‌మే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌డం వ‌ల్ల హీరో అల్లు అర్జున్ ఈ వేడుక‌లో పాల్గొన‌లేదు. హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నా, మిగ‌తా న‌టీన‌టులు కూడా ఎవ‌రూ దీనికి హాజ‌రు కాలేదు. చాలా సింపుల్‌గా ద‌ర్శ‌కుడు సుకుమార్, ఆయ‌న టీం స‌భ్యులు, నిర్మాత‌లు క‌లిసి పూజా కార్య‌క్ర‌మం పూర్తి చేశారు.

త‌ర్వాత స‌రైన ముహూర్తాలు లేక‌పోవ‌డంతో హీరో లేకుండానే సింపుల్‌గా ఇలా ముహూర్త వేడుక పూర్తి చేశారు. పూజా కార్య‌క్ర‌మంలో సంద‌ర్భంగా పుష్ప‌-2కు సంబంధించి ఒక కీల‌క మార్పు గురించి స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చింది. పుష్ప‌-1లో నిర్మాణ భాగ‌స్వామిగా ఉన్న ముత్తంశెట్టి మీడియా సంస్థ.. సీక్వెల్‌కు దూర‌మైంది. దాని స్థానంలోకి సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ వ‌చ్చింది.

అల్లు అర్జున్ అమ్మ త‌ర‌ఫు బంధువుల‌దే ముత్తంశెట్టి మీడియా సంస్థ‌. వారికి బ‌న్నీ త‌ర‌ఫున ఒక అవ‌కాశం ఇవ్వ‌డం కోసం పుష్ప‌లో భాగ‌స్వామిని చేశారు. బ‌న్నీ కాల్ షీట్లు ఈ సంస్థ‌తోనే ఉన్న‌ట్లుగా చెప్పించి ఆ మేర‌కు కొంత వాటా ఇప్పించారు. లాభాల్లో ఆ వాటాకు త‌గ్గ‌ట్లుగా లాభాల్లో కొంత షేర్ ఇచ్చారు. అంత‌టితో ఆ సంస్థ క‌థ ముగిసింది.

పుష్ప భారీ విజ‌యం సాధించ‌డం, సీక్వెల్ మీద అంచ‌నాలు భారీగా పెరిగిపోవ‌డంతో ద‌ర్శ‌కుడు సుకుమార్ దీనికి ఆదాయంలో ఎక్కువ వాటా తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ముందు నుంచి మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో తాను చేసే సినిమాల్లో పారితోష‌కంతో పాటు కొంత మేర లాభాల్లో వాటా తీసుకుంటున్నారు సుకుమార్. ఐతే పుష్ప‌-2 రేంజే వేరు కావ‌డం, ఫ‌స్ట్ పార్ట్ క‌న్నా రెండు మూడు రెట్లు వ‌సూళ్లు రాబ‌డుతుంద‌న్న అంచ‌నా ఉండ‌డంతో సుకుమార్ ఇందులో నిర్మాణ భాగ‌స్వామిగానూ చేరిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో ఆయ‌న రాజ‌మౌళికి ద‌గ్గ‌రగా ఆదాయం అందుకునే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

5 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

6 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

6 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

6 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

7 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

9 hours ago